News January 28, 2025
ఆత్మీయ భరోసాపై హైకోర్టు కీలక ఆదేశాలు

TG: పట్టణాల్లోని రైతు కూలీలకూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలనే వినతిపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గ్రామాల్లోని కూలీలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారని, మున్సిపాలిటీల పరిధిలో ఉండే వారికి అన్యాయం జరుగుతోందని కోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో మున్సిపాలిటీల్లో పలు గ్రామాలను విలీనం చేశారని, రైతు కూలీలందరినీ ఒకేలా చూడాలని పిటిషనర్లు కోరారు.
Similar News
News January 30, 2026
ఆలయాలు ఎక్కువగా కొండలపై ఎందుకు?

కొండ ఎక్కడం అనేది మనిషి తనలోని అహంకారం, కోరికలు అనే బరువులను వదిలి, నిర్మలమైన మనసుతో దైవాన్ని చేరుకోవడం. భౌతికంగా కొండలపై స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండి, భగవంతుని ధ్యానానికి అనువుగా ఉంటుంది. అలాగే పూర్వకాలంలో దండయాత్రల నుంచి ఆలయాలను రక్షించుకోవడానికి, జనసంచారానికి దూరంగా ప్రశాంతతను పొందడానికి మన పెద్దలు కొండలపైనే ఆలయాలను నిర్మించారు. పర్వతాలను ఆలయాలుగా కొలిచే గొప్ప సంస్కృతి మనది.
News January 30, 2026
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీలో ఉద్యోగాలు

<
News January 30, 2026
పాక్ T20 WC నిర్ణయంపై నేడు క్లారిటీ!

ICC T20 WC 2026లో పాకిస్థాన్ పాల్గొంటుందా లేదా అన్నదానిపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇటీవల PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. తమ అనంతరం నిర్ణయాన్ని శుక్రవారం/సోమవారం వెల్లడిస్తామని తెలిపారు. ICCతో సంబంధాలు కాపాడుకోవడం కీలకమని ప్రధానికి నఖ్వీ వివరించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే పాక్ జట్టు కొలంబోకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది.


