News February 18, 2025
విడదల రజినీకి హైకోర్టులో ఊరట

AP: మాజీ మంత్రి విడదల రజినీకి హైకోర్టులో ఊరట దక్కింది. తన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు రజినీ, ఆమె PAలపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. YCP హయాంలో చిలకలూరిపేట టౌన్ CI సూర్యనారాయణ తనను హింసిస్తూ వీడియోను అప్పటి MLA రజినీకి చూపించారని పిల్లి కోటి అనే వ్యక్తి PSలో ఫిర్యాదు చేశారు. దీంతో రజినీ, PAలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Similar News
News January 23, 2026
Q3 ఫలితాల ఎఫెక్ట్.. 4 శాతం తగ్గిన ఇండిగో షేర్

దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోకు డిసెంబరు త్రైమాసికంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లాభం ఏకంగా 78% పడిపోయి రూ.549.1 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.2,448.8 కోట్ల లాభం నమోదు కావడం గమనార్హం. విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయాలు, కొత్త కార్మిక చట్టాల అమలే దీనికి కారణమని కంపెనీ తెలిపింది. Q3 ఫలితాల ప్రభావంతో ఇండిగో షేర్ మార్కెట్లో దాదాపు 4% పడిపోయింది.
News January 23, 2026
364 పోస్టులకు నోటిఫికేషన్

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 364 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్, డిగ్రీ(BA,BCom,BBA,LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు NATS/NAPS పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.uraniumcorp.in
News January 23, 2026
KTR విచారణ.. BRS విరాళాలపై సిట్ ఆరా?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ 4 గంటలుగా కొనసాగుతోంది. ఓ ఛానెల్ ఎండీ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు వచ్చిన విరాళాలపైనా సిట్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎన్ని రూ.కోట్లు వచ్చాయనే వివరాలు అడిగినట్లు తెలుస్తోంది.


