News October 15, 2024

గ్రూప్-1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 7 ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన ఆన్సర్లు ఇవ్వలేదని, వాటికి మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని పలువురు పిటిషన్లు వేశారు. తాజాగా హైకోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ యథావిధిగా జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

Similar News

News October 15, 2024

ఈవీఎం వార్‌లోకి ఇజ్రాయెల్‌ను తెచ్చారు!

image

దేశంలో రగులుతున్న EVM రగడలోకి కాంగ్రెస్ ఇజ్రాయెల్‌ను చేర్చింది. 600Kms దూరంలోని పేజర్లను పేల్చగల ఇజ్రాయెల్ ఈవీఎంలనూ ఆపరేట్ చేయగలదని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ ఆరోపించారు. PM మోదీకి ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని ఉటంకించారు. ఇన్నాళ్లూ విపక్షాల ట్యాంపరింగ్ ఆరోపణలను చాలామంది రాజకీయ ప్రచారమనే భావించారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెద్దన్నను ఇందులోకి లాగడంతో ప్రజలు ఏ వాదనను అంగీకరిస్తారో చూడాలి.

News October 15, 2024

‘కంగువ’ ఆడియో లాంచ్‌కి రానున్న ప్రభాస్!

image

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ సినిమాపై మరింత హైప్ పెంచేందుకు మేకర్స్ ప్రభాస్‌ను రంగంలోకి దింపనున్నారు. ఆడియో లాంచ్‌కి ప్రభాస్, రజినీకాంత్‌ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. తన స్నేహితుడికి చెందిన UV క్రియేషన్స్ నిర్మిస్తుండటంతో ప్రభాస్ తప్పనిసరిగా వస్తారని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చిత్రం రూ.2వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్‌ అంచనా వేశారు.

News October 15, 2024

ఎన్నికల్లో ఉచిత హామీలతో లాభమేంటి?

image

అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలకు సులభంగా దొరికిన అస్త్రం ‘ఉచితం’. ఏ దేశమైనా ఎదగాలంటే ప్రాజెక్టులు, ఇన్ఫ్రా, రోడ్ల నిర్మాణం, ఉపాధి కల్పనకు ప్రోత్సాహకాల వంటివి ప్రకటించాలి. ఇందుకు భిన్నంగా బస్సుల్లో ఫ్రీ, కరెంటు ఫ్రీ, అకౌంట్లలోకి డబ్బుల బదిలీతో రాష్ట్ర ఖజానాలు ఖాళీ అవ్వడం చూస్తూనే ఉన్నాం. ఫ్రీబీస్‌పై అభిప్రాయం కోరుతూ కేంద్రం, ECIకి సుప్రీంకోర్టు తాజాగా నోటీసులిచ్చింది. దీనిపై మీ కామెంట్?