News October 16, 2024
అన్నక్యాంటీన్ల రంగులపై హైకోర్టులో విచారణ
AP: అన్నక్యాంటీన్లకు TDP రంగులు వేస్తున్నారని దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారించింది. గతంలో సచివాలయాలకు బ్లూ కలర్ వేయడంతో వాటిని తొలగించాలని ఇచ్చిన తీర్పును పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకి తెలిపారు. రంగులు తొలగించడానికి సమయం పట్టడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ సైతం దాఖలైందన్నారు. గతంలో క్యాంటీన్లకు ఏ కలర్ వేశారని కోర్టు ప్రశ్నించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, విచారణను 6వారాలకు వాయిదా వేసింది.
Similar News
News October 16, 2024
కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారు: సజ్జల
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ‘వైసీపీ నేతలను కేసుల్లో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన ఘటనలో ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. కేసు ముగిసే సమయానికి నోటీసులు ఏంటి? నటి జెత్వానీ కేసులోనూ ఇలాగే నన్ను ఇరికించారు. స్కిల్ కేసులో CBNకు ఈడీ క్లీన్ చిట్ ఎలా ఇస్తుంది? ఇంతకన్నా బరితెగింపు ఉంటుందా?’ అని ఫైర్ అయ్యారు.
News October 16, 2024
కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఏంటంటే?: హరీశ్ రావు
TG: పథకాలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘మహిళలకు 2 బతుకమ్మ చీరలు ఇస్తానని ఇవ్వలేదు. రూ.15వేల రైతుబంధు అమలు చేయలేదు. ఆగస్టులో చేయాల్సిన చేప పిల్లల పంపిణీ అక్టోబర్ వచ్చినా చేయలేదు. KCR కిట్ కంటే మంచిది ఇస్తానని చెప్పి గర్భిణులను మోసం చేశారు’ అని మండిపడ్డారు. ఉన్న పథకాలను నిలిపివేయడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని అన్నారు.
News October 16, 2024
‘అతిరథ మహారథులు’ అంటే ఎవరు?
రాజకీయ సభల్లో వేదికపై ఉన్న అతిరథ మహారథులు అంటూ ప్రసంగాలు మొదలుపెడుతుంటారు. అసలు ఆ పదాన్ని ఎవరికి వాడాలి? అతిరథ మహారథులు అంటే ఎవరు? అనే విషయాన్ని తెలుసుకుందాం. యుద్ధంలో పాల్గొన్న యోధుల సామర్థ్యాన్ని తెలిపేందుకు ఈ పదాన్ని వాడతారు. ఏకకాలంలో 5వేల మందితో యుద్ధం చేసేవారిని రథి అని, 60వేల మందితో యుద్ధం చేస్తే అతిరథ అని, 7లక్షల మందితో యుద్ధం చేసేవారిని మహారథి అని అంటారు. వీరు మాత్రమే ఆ పిలుపునకు అర్హులు.