News September 23, 2024
దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే
TG: హైదరాబాద్లోని దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. అక్కడ హైడ్రా కూల్చివేతలు చేపట్టవద్దని కోర్టు స్టే ఇచ్చింది. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నివాసితులు హాజరు కావాలని ఆదేశించింది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి 6 వారాల్లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పింది.
Similar News
News September 23, 2024
పిల్లలిద్దరూ ప్రయోజకులైతే.. ఆ తల్లికింకేం కావాలి!
పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. వారికి నచ్చిన చదువు, నైపుణ్యం ఉన్న క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు వెనకాడరు. అయితే, కొందరు మాత్రమే ప్రయోజకులై తల్లిదండ్రులకు, ఊరికి, దేశానికి పేరుతెస్తుంటారు. దేశానికి ఇద్దరు గ్రాండ్ మాస్టర్లను అందించిన ప్రజ్ఞానంద, వైశాలీల తల్లి నాగలక్ష్మి ఈరోజు ఎంతో గర్వపడి ఉంటారు. కూతురు, కుమారుడు ఇద్దరూ నేడు ప్రపంచ ఛాంపియన్లయ్యారు.
News September 23, 2024
రేపు ఉ.10 గం.కు రూ.300 టోకెన్లు విడుదల
డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం (రూ.300) టోకెన్లను రేపు ఉ.10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే డిసెంబర్ నెలకు సంబంధించి గదుల కోటాను రేపు మ.3 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు, టికెట్లు బుక్ చేసుకునేందుకు టీటీడీ <
News September 23, 2024
పేరు మార్చుకున్న టాలీవుడ్ హీరో!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకున్నారు. SUNDEEP KISHANలో A తొలగించి SUNDEEP KISHNగా ఛేంజ్ చేసుకున్నారు. అలాగే పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ను జత చేసుకున్నారు. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో ఆయన నటిస్తున్న మూవీకి ‘మజాకా’ అనే టైటిల్ను మేకర్స్ ఖరారు చేశారు. దీనిని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.