News February 7, 2025
ఢిల్లీలో హైడ్రామా: కేజ్రీవాల్ ఇంటికి ACB టీమ్
ఢిల్లీ రాజకీయాలు ముదురు పాకాన పడుతున్నాయి. BJP ఫిర్యాదుపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని LG వీకే సక్సేనా ACBని ఆదేశించారు. నిర్ణీత కాల వ్యవధిలోనే దర్యాప్తును పూర్తి చేయాలని సూచించారు. దీంతో అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పయనమయ్యారు. 16 మంది ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు రూ.15 కోట్ల చొప్పున ఇస్తామంటూ బీజేపీ ఎరవేసిందని నిన్న AK ఆరోపించారు. దీనిని ఖండించిన కమలం పార్టీ ACBకి ఫిర్యాదు చేసింది.
Similar News
News February 7, 2025
కోడిగుడ్డుపై అపోహలు.. వైద్యులేమన్నారంటే?
కోడిగుడ్డులో వైట్ మాత్రమే తినాలా? ఎల్లో తినొద్దా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. అలాంటి వారికి డా.మోహన వంశీ క్లారిటీ ఇచ్చారు. ‘బరువు తగ్గాలి అనుకునేవారికి ఎగ్ వైట్ ఎంతో మంచిది. అదే ఎల్లోలో A,D,E,B12 అనే విటమిన్లు, ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి, ఎనర్జీ కోసం చాలా అవసరం. ఎగ్స్ న్యూట్రిషన్ రిచ్ ఫుడ్. ఎలా తిన్నా మీ ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోండి’ అని తెలిపారు. SHARE IT
News February 7, 2025
కుటుంబంతో రాష్ట్రపతి భవన్ను సందర్శించిన సచిన్
ఢిల్లీ రాష్ట్రపతి భవన్లోని అతిథి గృహాన్ని కుటుంబంతో కలిసి సందర్శించడం తనకు దక్కిన గౌరవమని మాస్టార్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ‘రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించిన ఆతిథ్యం దీనిని మరింత ప్రత్యేకం చేసింది. విందులో హృదయపూర్వక సంభాషణలు నన్ను మరింత ప్రభావితం చేశాయి. ఈ అనుభవాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రాష్ట్రపతి భవన్ను సందర్శించి దాని గొప్పతనం, వారసత్వాన్ని తెలుసుకోండి’ అని తెలిపారు.
News February 7, 2025
ట్విస్ట్.. టీమ్ఇండియా కెప్టెన్గా హార్దిక్?
టీమ్ ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు ODI, T20 కెప్టెన్సీ ఇవ్వాలని BCCI యోచిస్తున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. బాగా రాణిస్తున్నప్పటికీ అతడికి అన్యాయం జరుగుతోందనే భావనలో కోచ్ గంభీర్, బోర్డు అధికారులున్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవకపోతే ODIలకు హార్దిక్ను కెప్టెన్ చేయాలని, T20ల్లో సూర్య బ్యాటింగ్లో విఫలమవుతున్న నేపథ్యంలో ఆ పగ్గాలు కూడా పాండ్యకే ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.