News March 18, 2024
అధిక ఛార్జీ వసూలు.. ఉబర్కు రూ.20వేల ఫైన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710681549288-normal-WIFI.webp)
ఉబర్కు వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. ప్రయాణికుడి నుంచి 8.83 కిలోమీటర్ల దూరానికి రూ.1,334 ఛార్జీ వసూలు చేయడంపై రూ.20 వేల జరిమానా విధించింది. చండీగఢ్కు చెందిన అశ్వనీ ప్రశార్ ఉబర్ క్యాబ్ ఎక్కగా తొలుత ఛార్జీ రూ.359 అని పేర్కొంది. గమ్యాన్ని చేరుకున్నాక రూట్ డీవియేషన్ల కారణంతో ట్రిప్ ఛార్జీ రూ.1,334 అని రావడంతో అతడు కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం కోర్టు
ఉబర్ సంస్థకు జరిమానా విధించింది.
Similar News
News July 8, 2024
‘స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటుపై సీఎం రేవంత్ ఆదేశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720441074436-normal-WIFI.webp)
TG: స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. దీనిని గచ్చిబౌలి ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ESCIలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ను పరిశీలించిన అనంతరం పారిశ్రామిక ప్రముఖులతో CM చర్చలు జరిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగావకాశాలు లభించేలా వర్సిటీలో కోర్సులు ఉండాలని సూచించారు.
News July 8, 2024
‘హరోమ్హర’లో ప్రణీత్.. క్షమాపణలు చెప్పిన హీరో
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720435367091-normal-WIFI.webp)
పిల్లలపై అసభ్యకర కామెంట్స్ చేసిన యూట్యూబర్ <<13586460>>ప్రణీత్<<>> హనుమంతు తన సినిమా ‘హరోమ్హర’లో నటించినందుకు చింతిస్తున్నట్లు హీరో సుధీర్ బాబు తెలిపారు. చిత్రయూనిట్ తరఫున తాను క్షమాపణలు చెబుతున్నట్లు X వేదికగా ప్రకటించారు. ఇతను ఇంతటి నీచమైన వ్యక్తి అని తమకు తెలియదని పేర్కొన్నారు. వీరి కామెంట్స్ ఏ మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి రావని స్పష్టం చేశారు.
News July 8, 2024
అలా అయితే రీ-నీట్కు ఆదేశిస్తాం: సుప్రీం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720439403731-normal-WIFI.webp)
నీట్ పవిత్రతను NTA దెబ్బతీసిందని రుజువైనా, నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా రీ-టెస్ట్కు ఆదేశిస్తామని పేపర్ లీకేజీపై విచారణ సందర్భంగా SC స్పష్టం చేసింది. ‘లీకైన పేపర్ వైరల్ చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. ముందు పేపర్ ఎలా లీకైంది? ఎంతమందికి చేరింది? ఎలా చేరింది? లీకేజీతో లబ్ధిపొందిన విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారనే ప్రశ్నలకు సమాధానాలు కావాలి’ అని వ్యాఖ్యానించింది.