News March 18, 2024
అధిక ఛార్జీ వసూలు.. ఉబర్కు రూ.20వేల ఫైన్

ఉబర్కు వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. ప్రయాణికుడి నుంచి 8.83 కిలోమీటర్ల దూరానికి రూ.1,334 ఛార్జీ వసూలు చేయడంపై రూ.20 వేల జరిమానా విధించింది. చండీగఢ్కు చెందిన అశ్వనీ ప్రశార్ ఉబర్ క్యాబ్ ఎక్కగా తొలుత ఛార్జీ రూ.359 అని పేర్కొంది. గమ్యాన్ని చేరుకున్నాక రూట్ డీవియేషన్ల కారణంతో ట్రిప్ ఛార్జీ రూ.1,334 అని రావడంతో అతడు కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం కోర్టు
ఉబర్ సంస్థకు జరిమానా విధించింది.
Similar News
News September 4, 2025
ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే మా విధానం: PM మోదీ

GST సంస్కరణలతో దీపావళికి ముందే ప్రజలకు ఆనందం వచ్చిందని PM మోదీ అన్నారు. ‘ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే మా ప్రభుత్వ విధానం. హెయిర్ పిన్నులు కూడా విదేశాల నుంచి తెచ్చుకునే విధానం మారాలి. కొత్త సంస్కరణల వల్ల మరింత ముందుగానే ఆత్మనిర్భర భారత్ సాకారం అవుతుంది. రూ.లక్ష కోట్ల విలువైన వంటనూనె దిగుమతి చేసుకుంటున్నాం. ఆ మొత్తం బయటకు వెళ్లకుండా ఆపగలిగితే ఎన్నో విద్యాలయాలు నిర్మంచవచ్చు’ అని PM తెలిపారు.
News September 4, 2025
రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడ జల్లులు పడ్డాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది.
News September 4, 2025
బెస్ట్ లెక్చరర్స్కు అవార్డుల ప్రకటన

TG: యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో విశేష సేవలందించిన అధ్యాపకులకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. OU నుంచి నలుగురు, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, చాకలి ఐలమ్మ, అంబేడ్కర్ ఓపెన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ప్రొ.జయశంకర్ వర్సిటీల్లో ఒక్కొక్క లెక్చరర్ను, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ వర్సిటీలో ఇద్దరిని బెస్ట్ లెక్చరర్స్గా ఎంపిక చేసింది. లిస్ట్ కోసం ఇక్కడ <