News February 27, 2025
CANCER సోకిన మహిళల్లోనే అధిక మరణాలు!

క్యాన్సర్ వచ్చిన ఐదుగురిలో ముగ్గురు చనిపోతున్నారని ఇండియన్ మెడికల్ ప్యానెల్ వెల్లడించింది. ది లాన్సెట్లో ప్రచురితమైన ICMR తాజా నివేదిక ప్రకారం గత దశాబ్దంలో పురుషుల కంటే మహిళల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే 2 దశాబ్దాల్లో ఇది పెరుగుతూనే ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. క్యాన్సర్ మరణాలు పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువగా ఉన్నాయి. కాగా, 2012- 2022 మధ్య క్యాన్సర్ కేసులు 36% పెరిగాయి.
Similar News
News January 30, 2026
దేశ తొలి బడ్జెట్.. విశేషాలివే

బ్రిటిష్ పాలనలో APR 7, 1860 తొలి దేశ బడ్జెట్ను జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతంలో NOV 26, 1947న షణ్ముఖం చెట్టి బడ్జెట్ పద్దును పార్లమెంటులో వినిపించారు. AUG 15, 1947 నుంచి MAR 31, 1948 మధ్య కాలానికే దీన్ని ప్రవేశపెట్టారు.
* ఆదాయ అంచనా ₹171.15Cr(సాధారణ వసూళ్లు-₹88Cr, పోస్టు, టెలిగ్రాఫ్లు-₹15Cr)
* వ్యయం అంచనా ₹197.39Cr(రక్షణ-₹92Cr, మిగతా మొత్తం పౌర ఖర్చులు).
* లోటు ₹26 కోట్లు.
News January 30, 2026
అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

AP: అమరావతి రైతుల సమస్యల పరిష్కారం దాదాపు కొలిక్కి వచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. వారి ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు. ‘29,233 మందికి 69,421ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇంకా 1914 మందికి 7273 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి. డ్రైన్లు నిర్మించాక సర్వే రాళ్లు వేయాలని రైతులు కోరారు. వర్షాకాలం నాటికి ప్లాట్లలో పూర్తి సదుపాయాలు కల్పిస్తాం’ అని కమిటీ భేటీ అనంతరం చెప్పారు.
News January 30, 2026
బాంబు పేలుళ్లు జరపాలని అధికారులు చెప్పారు: పంజాబ్ మాజీ సీఎం

బాంబు పేలుళ్లకు కుట్ర చేయాలని అధికారులు సూచించారని పంజాబ్ Ex CM రాజిందర్ కౌర్ భట్టల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘ఎన్నికల్లో గెలవాలంటే ఉగ్ర వాతావరణం సృష్టించాలని అధికారులు సలహా ఇచ్చారు. మార్కెట్లు, రైళ్లలో పేలుళ్లకు పాల్పడాలని చెప్పారు. కానీ వారి సూచనలను నేను తిరస్కరించా’ అని ఓ పాడ్ కాస్ట్లో అన్నారు. ఈ ఘటనపై లీగల్ యాక్షన్కు CM మాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 1996-97లో CMగా కౌర్ పనిచేశారు.


