News February 27, 2025
CANCER సోకిన మహిళల్లోనే అధిక మరణాలు!

క్యాన్సర్ వచ్చిన ఐదుగురిలో ముగ్గురు చనిపోతున్నారని ఇండియన్ మెడికల్ ప్యానెల్ వెల్లడించింది. ది లాన్సెట్లో ప్రచురితమైన ICMR తాజా నివేదిక ప్రకారం గత దశాబ్దంలో పురుషుల కంటే మహిళల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే 2 దశాబ్దాల్లో ఇది పెరుగుతూనే ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. క్యాన్సర్ మరణాలు పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువగా ఉన్నాయి. కాగా, 2012- 2022 మధ్య క్యాన్సర్ కేసులు 36% పెరిగాయి.
Similar News
News September 19, 2025
అఫ్గానిస్థాన్పై శ్రీలంక విజయం

ఆసియా కప్: అఫ్గానిస్థాన్పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 169-8 రన్స్ చేసింది. AFG బ్యాటర్లలో నబి(60), SL బౌలర్లలో తుషారా 4 వికెట్లతో రాణించారు. లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(74) చెలరేగడంతో 170 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. AFG బౌలర్లలో ముజీబ్, అజ్మతుల్లా, నబి, నూర్ తలో వికెట్ తీశారు. లంక సూపర్ 4కు క్వాలిఫై అవ్వగా.. AFG టోర్నీ నుంచి ఎలిమినేటైంది.
News September 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 19, 2025
మేడారం జాతర మాస్టర్ ప్లాన్ సిద్ధం: మంత్రులు

TG: తెలంగాణ కుంభమేళాగా పిలుచుకొనే మేడారం జాతరకు మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్కు CM రేవంత్ ఆమోదం లభించగానే ఆధునికీకరణ పనులు ప్రారంభించి.. వందరోజుల్లోగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏర్పాట్ల విషయంలో సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనలు, సలహాలు తీసుకున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు.