News April 12, 2025

ఇంటర్‌లో అత్యధిక మార్కులు

image

AP: ఇంటర్ ఫలితాల్లో పలువురు సత్తా చాటారు. హర్షిణి, హేమలత, సిరి (ప్రకాశం), లాస్య (తిరుపతి)లకు సెకండియర్ MPCలో 991 మార్కులు వచ్చాయి. Bipcలో హారిక (ప్రకాశం) 991 మార్కులు సాధించింది. ఫస్టియర్ MPCలో నాదెండ్ల కృష్ణప్రియ (పొన్నూరు) 470కి 467, భాగ్యలక్ష్మి(తిరుపతి) 465, KGBV విద్యార్థిని రేవతి (అనకాపల్లి) Bipcలో 440కి 433 మార్కులు తెచ్చుకున్నారు. మీకు తెలిసిన వారిలో ఎక్కువ మార్కులు ఎన్ని? కామెంట్ చేయండి.

Similar News

News March 5, 2026

నేడు షా సమక్షంలో నితీశ్ నామినేషన్?

image

బిహార్ సీఎం నితీశ్ కుమార్ నేడు కేంద్రహోంమంత్రి అమిత్ షా సమక్షంలో రాజ్యసభ నామినేషన్ వేసే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈరోజు NDA శ్రేణులతో భేటీకి షా బిహార్ రానున్నారు. ఈ సందర్భంగా BJP చీఫ్ నితిన్ నబీన్‌తో పాటు నితీశ్ కూడా షా సమక్షంలో నామినేషన్‌ వేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే జేడీయూలో ఓ వర్గం ఇందుకు సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో బిహార్ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

News March 5, 2026

ఇరాన్‌పై US పోరు వెనుక మతం రంగు?

image

ఇరాన్‌పై దాడులను సమర్థించుకునే క్రమంలో US తమ సైనికులకు మతసిద్ధాంతాలను చొప్పిస్తున్నట్లు రిపోర్ట్స్ రావడం కలకలం రేపుతోంది. దాదాపు 40 యూనిట్ల నుంచి 110 ఫిర్యాదులు వచ్చినట్లు మిలిటరీ రిలీజియస్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వెల్లడించింది. బైబిల్‌లో పేర్కొన్న అర్మాగెడ్డాన్ (చెడుపై దేవుడి పోరు)ను సృష్టించేందుకు ఇరాన్‌పై దాడి చేయమని ట్రంప్‌కు జీసస్ సందేశం పంపారని కమాండర్ అధికారులకు చెప్పినట్లు రిపోర్ట్ పేర్కొంది.

News March 5, 2026

గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

image

AP: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులోని అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని మంత్రి డోలా వీరాంజనేయస్వామి వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చే బిల్లుకు నిన్న శాసనమండలిలో ఆమోదం లభించింది. YCP హయాంలో లోపభూయిష్టంగా ఉన్న వ్యవస్ధను పటిష్టంగా తీర్చిదిద్దుతున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. వీటితో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు.