News August 30, 2024

ఢిల్లీలో గత 12 ఏళ్లలోనే అత్యధిక వర్షపాతం

image

దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు నెలలో ఇప్పటివరకు 378.5mmల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత 12 ఏళ్లలో ఇదే అత్యధికమని పేర్కొంది. 2013 ఆగస్టులో 321.4mm వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. ఓవరాల్‌గా 1961 AUGలో నమోదైన 583.3mm వర్షపాతమే ఇప్పటికీ అత్యధికంగా ఉంది. మరోవైపు ఈ సీజన్‌లో ఇప్పటివరకు 825.5 మి.మీ.ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం.

Similar News

News November 24, 2025

వరంగల్: ఓట్లకు మహిళలపై ఫోకస్..!

image

అధికార కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీల్లో ఓట్లు రాబట్టేందుకు మహిళలపై ఫోకస్ చేసింది. ఉమ్మడి జిల్లాలో చాలా వేగంగా మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. వరంగల్‌లో 11,295, HNK 10,625, మహబూబాబాద్ 15,511, భూపాలపల్లి 8,257, ములుగు 6,930 గ్రూపుల్లో 6,76,000 మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నారు. వీరితో పాటుగా రేషన్ కార్డున్న వారికి సైతం అందించి ఓట్లను సంపాదించాలనే ఆలోచనలో హస్తం నేతలున్నారు.

News November 24, 2025

ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

image

TG: హైదరాబాద్ శామీర్‌పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.

News November 24, 2025

భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

image

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.