News November 18, 2024
BGTలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన యాక్టివ్ ప్లేయర్లలో పుజారా టాప్లో ఉన్నారు. 24 టెస్టులు ఆడిన ఆయన 2,033 రన్స్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లీ (24 టెస్టులు, 1979 రన్స్), స్టీవ్ స్మిత్ (18 T, 1887 R), రహానే (17 T, 1090 R), లబుషేన్ (9 T, 708 R) ఉన్నారు. కాగా పుజారా, రహానే ఈనెల 22 నుంచి జరగనున్న సిరీస్కు ఎంపిక కాలేదన్న విషయం తెలిసిందే.
Similar News
News November 13, 2025
SC, ST యువతకు ఉచితంగా సివిల్స్ కోచింగ్: మంత్రి

AP: ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా UPSC సివిల్స్ శిక్షణ ఇస్తామని మంత్రి DBV స్వామి తెలిపారు. రాష్ట్రంలోని 340 మందికి విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లోని అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లలో ఫ్రీగా ప్రిలిమ్స్ శిక్షణ అందిస్తామన్నారు. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 13 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. సైట్ https://apstudycircle.apcfss.in
News November 13, 2025
LSG-MI మధ్య టాక్స్.. ఎక్స్ఛేంజ్ అయ్యేది వీళ్లే!

IPL రిటెన్షన్ గడువు దగ్గర పడుతుండటంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల స్వాపింగ్ చర్చల్లో వేగం పెంచాయి. RR, CSK మధ్య <<18253766>>కీలక ఆటగాళ్ల<<>> ఎక్స్ఛేంజ్కు ఇప్పటికే ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి. తాజాగా LSG-MI కూడా చెరో ప్లేయర్ను మార్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. LSG నుంచి MIకి శార్దూల్ ఠాకూర్, MI నుంచి LSGకి అర్జున్ టెండూల్కర్ మారతారని cricbuzz తెలిపింది. MIతో శార్దూల్ డీల్ కుదిరినట్లు అశ్విన్ చెప్పడం గమనార్హం.
News November 13, 2025
ఢిల్లీ పేలుడు: 300 కిలోల అమ్మోనియం నైట్రేట్ ఎక్కడ?

టెర్రరిస్టులు బంగ్లాదేశ్, నేపాల్ మీదుగా పేలుడు పదార్థాలను దేశంలోకి తీసుకొచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. 3,200KGs <<18254431>>అమ్మోనియం నైట్రేట్<<>> కన్సైన్మెంట్ రాగా, అందులో 2,900KGs స్వాధీనం చేసుకున్నారు. మరో 300KGs దొరకలేదు. అది ఎక్కడుందో తెలుసుకునేందుకు అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు బాబ్రీ మసీదును కూల్చిన రోజు(DEC 6) దేశవ్యాప్తంగా దాడులకు ఉమర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


