News September 6, 2024

గంజాయి సాగు కోసం హిమాచల్ అసెంబ్లీ తీర్మానం

image

గంజాయి సాగును చట్టబద్ధం చేసేలా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. వైద్య, పారిశ్రామికపరమైన ఉపయోగాల కోసం గంజాయిని సాగు చేయాలని అసెంబ్లీ కమిటీ ప్రతిపాదించిన నేపథ్యంలో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. రాష్ట్రానికి గంజాయి సాగు చక్కటి రాబడి అవుతుందని కమిటీ నివేదికలో పేర్కొనడం గమనార్హం. కశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే విజయవంతమైందని అందులో వివరించింది.

Similar News

News November 17, 2025

ఐబొమ్మకు ఇక సెలవు

image

అనధికారిక (పైరసీ) మూవీ వెబ్‌సైట్ iBOMMAకు ‘సెలవు’ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నెలకు రూ.వేలల్లో చెల్లించి OTTలో మూవీలు చూడలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడిందని గుర్తుచేసుకుంటున్నారు. అయితే దీనివల్ల థియేటర్లకు వెళ్లేవారు తగ్గారని, రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల ‘పైరసీకి సెలవు’ అంటూ మరికొందరు స్వాగతిస్తున్నారు. ఐబొమ్మ క్లోజ్ అవ్వడం సినీ పరిశ్రమకు, OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉపశమనం కలిగించింది.

News November 17, 2025

ఐబొమ్మకు ఇక సెలవు

image

అనధికారిక (పైరసీ) మూవీ వెబ్‌సైట్ iBOMMAకు ‘సెలవు’ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నెలకు రూ.వేలల్లో చెల్లించి OTTలో మూవీలు చూడలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడిందని గుర్తుచేసుకుంటున్నారు. అయితే దీనివల్ల థియేటర్లకు వెళ్లేవారు తగ్గారని, రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల ‘పైరసీకి సెలవు’ అంటూ మరికొందరు స్వాగతిస్తున్నారు. ఐబొమ్మ క్లోజ్ అవ్వడం సినీ పరిశ్రమకు, OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉపశమనం కలిగించింది.

News November 17, 2025

‘షూ బాంబర్’.. ఢిల్లీ పేలుడులో కీలక పరిణామం!

image

ఢిల్లీ పేలుడు కేసులో కీలక ముందడుగు పడింది. డా.ఉమర్ నబీ i20 కారును ‘షూ బాంబర్’తో పేల్చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. బ్లాస్ట్ అయిన కారు ముందు భాగంలో షూను కనుగొన్న అధికారులు అందులో మెటల్ లాంటి వస్తువును గుర్తించారు. దీంతో బాంబును యాక్టివేట్ చేయడానికి ఉమర్ షూ ట్రిగ్గర్‌ను ఉపయోగించినట్లు భావిస్తున్నారు. కాగా ఈ నెల 10న ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో 10 మంది మరణించగా 32 మంది గాయపడ్డారు.