News June 24, 2024

హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవి: అదానీ

image

గత ఏడాది సంచలనం రేపిన హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ పునరుద్ఘాటించారు. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు జరిగిన కుట్ర అని 32వ వార్షిక జనరల్ మీటింగ్‌లో షేర్ హోల్డర్లతో పేర్కొన్నారు. ‘అదానీ గ్రూప్ ఆర్థిక వృద్ధిపై అసత్య ఆరోపణలు చేయడమే కాక దీనికి రాజకీయ రంగు పులమాలని ప్రయత్నించారు. FPO క్లోజింగ్‌కు రెండు రోజుల ముందే ఈ దాడి జరిగింది’ అని తెలిపారు.

Similar News

News January 19, 2026

వరిలో జింకు లోపాన్ని ఎలా నివారించాలి?

image

వరి తర్వాత తిరిగి వరినే పండించే నేలలో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్‌ను ప్రతి రబీ పంటకు ముందు దమ్ములో వేసి పైరులో జింకు లోపం ఏర్పడకుండా నివారించవచ్చు. భాస్వరం ఎరువులు వేయడానికి 2 రోజుల ముందు జింకు సల్ఫేట్ వేయాలి. పైరుపై జింకు లోపం కనిపిస్తే ఒక ఎకరానికి 400 గ్రాముల జింకు సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి వరి ఆకులు మొత్తం తడిచేలా.. నిపుణుల సూచనలతో వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.

News January 19, 2026

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేయనున్న TTD

image

AP: ఏప్రిల్ కోటా తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన)ను 10AMకు TTD విడుదల చేయ‌నుంది. 21వ తేదీ ఉ.10గం.ల వరకు ఆన్‌లైన్‌లో ఈ-డిప్‌కు నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 23న మ.12 గంటల్లోపు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. 22న ఆర్జిత సేవ టికెట్లు(కళ్యాణోత్సవం), 23న అంగ ప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, 24న అకామిడేషన్(రూమ్స్), రూ.300 దర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు.

News January 19, 2026

అదును తప్పిన పైరు.. ముదిమిలో బిడ్డలు ఒక్కటే

image

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.