News August 12, 2024

ఆయనది ఆత్మహత్య: ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కుటుంబం

image

ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్ప్‌ది సహజ మరణం కాదని ఆయన కుటుంబం వెల్లడించింది. డిప్రెషన్, ఆందోళన కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డారని పేర్కొంది. ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులాడిన గ్రాహం ఈ నెల 5న కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయారని అందరూ అనుకున్నారు. హెల్త్ బాగాలేకపోవడంతో కుటుంబానికి భారంగా మారానని బాధపడుతూ ఉండేవారని థోర్ప్ భార్య తెలిపారు. ఆ బాధతోనే సూసైడ్ చేసుకున్నారని వివరించారు.

Similar News

News November 19, 2025

కరప: రూ.1.48 లక్షలు డ్రా చేశారంటూ ఫిర్యాదు

image

కరపకు చెందిన ఓ మీడియా ప్రతినిధి బ్యాంక్ ఖాతా నుంచి బుధవారం రూ.1.48 లక్షలు కేటుగాళ్లు డ్రా చేశారు. ఎలాంటి లావాదేవీలు చేయకపోయినా, ఈ మొత్తాన్ని డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో ఆందోళన చెంది, వెంటనే క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇలా సొమ్ములను కాజేస్తున్నారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

News November 19, 2025

వన్డేల్లో తొలి ప్లేయర్‌గా రికార్డు

image

వెస్టిండీస్ ప్లేయర్ షై హోప్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఫుల్‌ మెంబర్ టీమ్స్ అన్నింటిపై సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. అటు వన్డేల్లో హోప్ 19 సెంచరీలు నమోదు చేశారు. అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్ ఫుల్‌ మెంబర్స్ టీమ్స్. కాగా ఇవాళ్టి రెండో వన్డేలో వెస్టిండీస్‌పై NZ గెలిచింది.

News November 19, 2025

సూసైడ్ బాంబర్: క్లాసులకు డుమ్మా.. ఆర్నెళ్లు అజ్ఞాతం!

image

ఢిల్లీ పేలుళ్ల బాంబర్ ఉమర్‌కు అల్ ఫలాహ్ వర్సిటీ స్వేచ్ఛ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. అతడు క్లాస్‌లకు సరిగా వచ్చేవాడు కాదని, వచ్చినా 15 ని.లు మాత్రమే ఉండేవాడని సహచర వైద్యులు విచారణలో తెలిపారు. 2023లో ఆర్నెళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లాడన్నారు. ఉమర్‌ను తొలగించాల్సి ఉన్నాతిరిగి రాగానే వర్సిటీ విధుల్లో చేర్చుకుందని చెప్పారు. పోలీసుల వరుస విచారణలతో డాక్టర్లు, స్టూడెంట్లు వర్సిటీ నుంచి వెళ్లిపోతున్నారు.