News November 7, 2024
నెహ్రూని వ్యతిరేకించి ఆయన ప్రశంసలే పొందిన ఘనుడు (2/2)

రైతుల కోసం ఎన్జీ రంగా చేసిన పోరాటం అనిర్వచనీయం. రష్యా ముద్రగల సమష్టి సహకార విధానాన్ని నాటి ప్రధాని నెహ్రూ పార్లమెంట్లో ప్రవేశపెట్టగా దానిని వ్యతిరేకిస్తూ ఎన్జీ ఉత్తేజిత ప్రసంగం చేశారు. ఆ బిల్లు వీగిపోయేలా చేశారు. అనంతరం ‘రంగాజీ పార్లమెంట్లో ఉన్నంత కాలం రైతాంగం హాయిగా నిద్రపోవచ్చు’ అని నెహ్రూనే ప్రశంసించడం కొసమెరుపు. 1930-1991 వరకు ఎంపీగా సేవలు అందించిన ఎన్జీ రంగా గిన్నిస్ రికార్డు సాధించారు.
Similar News
News January 17, 2026
నగలు సర్దేయండిలా..

మహిళలకు అలంకారం, ఆభరణాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. మార్కెట్లోకి లేటెస్ట్గా ఏ నగ వచ్చినా సరే కొనేయాల్సిందే. అయితే వాటిని సరిగ్గా భద్రపరచకపోతే అవి కొన్నాళ్లకు రంగుమారి పాడైపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే..ఆభరణాలు భద్రపరిచే ముందు శుభ్రంగా తుడిచి ఆరబెట్టిన తర్వాతే బాక్సుల్లో సర్దాలి. అన్ని రకాల నగలను ఒకే బాక్సులో పెట్టకూడదు. విడివిడిగా ఎయిర్టైట్ బాక్సులు, జిప్ లాక్ బ్యాగులు వాడాలి.
News January 17, 2026
నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ(<
News January 17, 2026
తిరుమల సప్తగిరులకు ఆ పేర్లెలా వచ్చాయంటే..?

తిరుమలలోని 7 కొండలకు విశిష్టమైన చరిత్ర ఉంది. శ్రీవారి ఆజ్ఞతో గరుత్మంతుడు తెచ్చిన గరుడాద్రి, వృషభాసురుడి పేరున వృషభాద్రి, అంజనీదేవి తపస్సు చేసిన అంజనాద్రి ప్రధానమైనవి. తొలిసారి తలనీలాలు సమర్పించిన నీలాంబరి పేరుతో నీలాద్రి, ఆదిశేషుడి పేరిట శేషాద్రి, పాపాలను దహించే వేంకటాద్రి, నారాయణుడు తపస్సు చేసిన నారాయణాద్రిగా నేడు వీటిని పిలుస్తున్నారు. ఈ ఏడు కొండలు భక్తికి, ముక్తికి నిలయాలు.


