News August 30, 2024

History Created: తొలిసారి నిఫ్టీ @ 25200

image

NSE నిఫ్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. చరిత్రలో తొలిసారి 25200 స్థాయిని అధిగమించింది. ఉదయం 25,249 వద్ద మొదలైన సూచీ 77 పాయింట్ల లాభంతో 25,229 వద్ద కదలాడుతోంది. ఇక BSE సెన్సెక్స్ 215 పాయింట్లు పెరిగి 82,345 వద్ద చలిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినా అన్ని రంగాల సూచీలు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. సూచీలు పెరుగుతున్నా BSE మార్కెట్ బ్రెడ్త్ మాత్రం బయ్యర్లకు అనుకూలంగా లేదు.

Similar News

News December 30, 2025

గర్ల్ ఫ్రెండ్‌తో ప్రియాంకా గాంధీ కుమారుడి ఎంగేజ్‌మెంట్!

image

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇవాళ లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ అవివా బేగ్‌తో ఎంగేజ్‌మెంట్ అయిందని నేషనల్ మీడియా పేర్కొంది. వారిద్దరూ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినట్లు తెలిపింది. రైహాన్ 2000 సంవత్సరంలో జన్మించారు. అవివా కుటుంబం ఢిల్లీలో ఉంటున్నట్లు సమాచారం.

News December 30, 2025

రైతులు ఆందోళన చెందవద్దు: తుమ్మల

image

TG: రాష్ట్రంలో యూరియా సరఫరా కొనసాగుతోందని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాల్లో 47.68 లక్షల సంచుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. రబీ సీజన్(అక్టోబర్-మార్చి)లో కేంద్రం రాష్ట్రానికి 20.10 లక్షల మెట్రిక్ టన్నుల(LMTs) యూరియా కేటాయించిందని తెలిపారు. ఇప్పటివరకు అందిన 5.70LMTs యూరియాలో 3.71LMTs రైతులు కొనుగోలు చేయగా 2.15LMTs జిల్లాల్లో అందుబాటులో ఉందన్నారు.

News December 30, 2025

వచ్చే ఏడాదీ రిపీట్ చేస్తారా?

image

కొత్త సంవత్సరం మొదలవుతుందంటే చాలు ఎక్కడ లేని రెజల్యూషన్స్ వస్తాయి. జిమ్‌కు వెళ్లడం, డైట్ మెయింటేన్ చేయడం, హెల్త్‌ను కాపాడుకోవడం, డబ్బులు సేవ్ చేసుకోవడం అంటూ నిర్ణయాలు తీసుకుంటారు. 2025 ప్రారంభంలోనూ ఇలాంటి నిర్ణయాలే తీసుకొని ఉంటారు. వీటిలో ఎన్ని ఆచరణలో పెట్టారు? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? మారింది ఇయర్ మాత్రమేనా? మీ లైఫ్‌లో చోటు చేసుకున్న మార్పులు ఏంటి?