News July 12, 2024
చరిత్ర సృష్టించిన మీర్జాపూర్-3

ఈ నెల 5న విడుదలైన మీర్జాపూర్-3 వెబ్ సిరీస్ చరిత్ర సృష్టించింది. స్ట్రీమింగ్ మొదలైన తొలి వారం INDలో అమెజాన్ ప్రైమ్లో అత్యధిక మంది వీక్షించిన సిరీస్గా నిలిచినట్లు OTT సంస్థ తెలిపింది. 180+ దేశాల ప్రజల వీక్షించగా, 85 కంట్రీస్లో టాప్-10లో ట్రెండ్ అవుతోందట. కాగా తొలి రెండు సీజన్లతో పోల్చితే ఈ సిరీస్ ఆకట్టుకోలేదని వీక్షకులు చెబుతున్నారు. మరోవైపు సీజన్-4 షూటింగ్ కూడా మొదలైనట్లు మేకర్స్ వెల్లడించారు.
Similar News
News January 23, 2026
ఈ నెల 27న ‘జన నాయగన్’పై తుది తీర్పు

విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ వివాదంపై మద్రాస్ హైకోర్టు ఈ నెల 27న తుది తీర్పు ఇవ్వనుంది. ఇటీవల కోర్టు తీర్పును <<18907956>>రిజర్వ్<<>> చేసిన విషయం తెలిసిందే. చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ CBFC అప్పీల్ దాఖలు చేయడంతో వివాదం చెలరేగింది. డివిజన్ బెంచ్ ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మూవీ విజయ్ చివరి సినిమా కావడం గమనార్హం.
News January 23, 2026
‘రిపబ్లిక్ డే‘ వేడుకల్లో అమరావతి రైతులకు ప్రత్యేక గ్యాలరీ

AP: రిపబ్లిక్ డే ని మొదటిసారి ఈ ఏడాది అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డులో నిర్వహించేందుకు CRDA అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో అమరావతి రైతులకు ప్రత్యేక VIP గ్యాలరీ ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక ఆహ్వాన పత్రికలు పంపుతున్నారు. 13 వేల మందికి వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకూ రిపబ్లిక్ డే, స్వతంత్ర దినోత్సవాలను విజయవాడ మున్సిపల్ స్టేడియంలో చేపట్టేవారు.
News January 23, 2026
గోదావరి పుష్కరాలకు 10 కోట్ల మంది!

AP: 2027 జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని CM CBN అధికారులను ఆదేశించారు. 3వ సారి ఈ పుష్కరాలు నిర్వహిస్తుండడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. ‘పోలవరం’ పనులు ఈలోగా పూర్తిచేయాలన్నారు. పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. పుష్కరాలకు 10కోట్ల మంది వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.


