News July 6, 2024

HIV కలకలం.. త్రిపురలో 47 మంది మృతి

image

త్రిపురలో ఇప్పటివరకు హెచ్ఐవీతో 47 మంది విద్యార్థులు మరణించారు. 828 మంది విద్యార్థులకు HIV పాజిటివ్‌గా గుర్తించినట్లు TCACS అధికారి తెలిపారు. ప్రతి రోజూ 5-7 కొత్త కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తంగా HIVతో బాధపడుతున్నవారి సంఖ్య 5,674గా ఉందన్నారు. సంపన్న కుటుంబాల పిల్లలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారని, కేసుల పెరుగుదలకు మాదకద్రవ్యాల దుర్వినియోగమే కారణమని తెలిపారు.

Similar News

News March 26, 2026

‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా తీస్తున్నా: వివేక్ అగ్నిహోత్రి

image

పాక్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ కథాంశంతో సినిమాను తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు. ఈ చిత్రాన్ని T-సిరీస్ నిర్మిస్తుందని తెలిపారు. ‘ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరమైన కథలను చెప్పడానికి నేను సిద్ధం. ధైర్యం, స్పష్టత, ప్రొఫెషనలిజమ్‌తో సినిమాలు తీయడానికి ప్రాధాన్యం ఇస్తా. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కల్పించడానికే నా ప్రయత్నం’ అని పేర్కొన్నారు.

News March 26, 2026

ఏప్రిల్ 4 నుంచి టెన్త్ వాల్యుయేషన్

image

APలో ఈ నెల 16 నుంచి కొనసాగుతోన్న టెన్త్ ఎగ్జామ్స్ APR 2తో ముగుస్తాయి. వచ్చే నెల 4 నుంచి 13 మధ్య వాల్యుయేషన్ పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. ఈసారి ట్యాబ్స్ ద్వారా మూల్యాంకనం సెంటర్లలోనే మార్కులను నమోదు చేస్తారన్నారు. అన్ని కేంద్రాల్లో CCTVలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా APR మూడో వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.

News March 26, 2026

నేపాల్‌లో లీటర్ పెట్రోల్ రూ.187

image

యుద్ధ ప్రభావంతో నేపాల్‌లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌ ధరలు లీటరుకు రూ.15 (నేపాల్ కరెన్సీ)చొప్పున పెరిగాయి. కేటగిరీ-1 ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.184.50, కేటగిరీ-2లో రూ.186, కేటగిరీ-3లో రూ.187గా ఉంది. ఆయా ప్రాంతాలను బట్టి డీజిల్, కిరోసిన్ రేట్లు రూ.164.50, రూ.166గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరలకు అనుగుణంగా దేశీయంగా రేట్ల పెంపు తప్పలేదని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది.