News August 9, 2024

HMDAలోకి మన ఉమ్మడి మెదక్

image

HMDAలో కొత్తగా 2 <<13811034>>జోన్లు<<>> పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలు కలిశాయి. మేడ్చల్-1 జోన్‌లో నర్సాపూర్, శివంపేట, తూప్రాన్, మనోహరాబాద్, మేడ్చల్-2లో ములుగు, వర్గల్, శంకర్‌ప్లలి-1లో రామచంద్రాపురం, శంకర్‌ప్లలి-2లో అమీన్‌పూర్, పటాన్‌చెరు, సంగారెడ్డి, కంది, జిన్నారం, గుమ్మడిదల, హత్నూర ఉన్నాయి. త్వరలో RRR మొత్తం HMDA పరిధిలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

Similar News

News December 17, 2025

మెదక్: మండలాల వారీగా పోలింగ్ శాతం

image

మెదక్ జిల్లాలో మూడో విడత 7 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగగా 90.68 శాతం ఓటింగ్ జరిగినట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. ఒంటిగంట తర్వాత నమోదైన ఓటింగ్ శాతం.. చిలపిచెడు మండలంలో 90.02, కౌడిపల్లి 90.80, కుల్చారం 89.20, మాసాయిపేట 88.90, నర్సాపూర్ 93.38, శివంపేట 92.57, వెల్దుర్తి 87.62 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.

News December 17, 2025

మెదక్ జిల్లాలో 90.68% పోలింగ్

image

మెదక్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 90.68 % పోలింగ్ నమోదైంది. మొదటి, రెండవ విడత కంటే మూడవ విడత ఓటింగ్ పెరిగింది. ఈసారి నర్సాపూర్ మండలలో ఎక్కువగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
చిలప్ చెడ్ – 90.02%,
కౌడిపల్లి – 90.80%,
కుల్చారం – 89.20%,
మసాయిపేట – 88.90 %,
నర్సాపూర్ – 93.38%,
శివంపేట – 92.57%,
వెల్దుర్తి – 87.62 % నమోదైంది.

News December 17, 2025

BREAKING: మెదక్ జిల్లాలో తొలి ఫలితం

image

మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో చిలిప్ చేడ్ మండలం గుజిరి తండా గ్రామ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి రామావత్ సుజాత ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మూడావత్ రుక్మిణిపై 14 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆమె గెలుపొందారు. సుజాత విజయం ఖరారు కావడంతో అనుచరులు, పార్టీ నాయకులు టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుతూ గ్రామంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.