News February 11, 2025

HNK: ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ.. UPDATE

image

హన్మకొండలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు <<15418647>>పంచాయతీరాజ్ ఏఈ<<>> రమేశ్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాలు.. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన మొగిలయ్య ఇంటి నిర్మాణం కోసం పంచాయతీ రాజ్ ఏఈ రమేశ్ రూ.15వేలు లంచం అడిగి రూ.10వేలకు కుదుర్చుకున్నాడు. బాధితుడు అధికారులను సంప్రదించగా.. రమేశ్‌ను, ఏఈ సహాయకుడు సారయ్యను HNKలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.

Similar News

News December 1, 2025

ఈ టీకాతో గర్భాశయ క్యాన్సర్‌కు 90% చెక్..!

image

మహిళలకు ప్రాణాంతకమైన గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. HPV టీకా తీసుకున్న బాలికల్లో, టీకా తీసుకోని వారితో పోలిస్తే, గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 80% నుంచి 90% వరకు గణనీయంగా తగ్గినట్లు తాజా డేటా స్పష్టం చేసింది. టీకా తీసుకున్న తర్వాత 15-20 సంవత్సరాల పాటు రక్షణ ప్రభావం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

News December 1, 2025

చిన్న వయసులోనే టీకా ఎందుకు తీసుకోవాలంటే..?

image

గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంక్రమించడానికి ముందే టీకా తీసుకోవడం వల్ల అత్యధిక రక్షణ లభిస్తుంది. అందుకే, లైంగిక చర్య ప్రారంభానికి ముందే, అంటే 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సులో బాలికలకు టీకా ఇవ్వాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాలికలకే కాకుండా పురుషాంగం, పాయువు, గొంతు క్యాన్సర్ల రక్షణ కోసం బాలురు కూడా ఈ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 1, 2025

అమరావతిలో ‘క్వాంటం’ విప్లవం.. 50వేల మందికి శిక్షణ

image

అమరావతిని గ్లోబల్ క్వాంటం హబ్‌గా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ‘అమరావతి క్వాంటం మిషన్’ను ప్రారంభించింది. WISER, Qubitech సహకారంతో 50 వేల మంది విద్యార్థులు, నిపుణులకు క్వాంటం టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనున్నారు. డిసెంబర్ 8న ప్రారంభం. ఫేజ్-1: ఫౌండేషన్ కోర్సు ఫీజు రూ.500. ఫేజ్-2: ఇందులో ప్రతిభ చూపిన టాప్ 3 వేల మందికి అడ్వాన్డ్స్ శిక్షణ పూర్తిగా ఉచితం. దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్నవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.