News March 12, 2025
HNK: గ్రూప్-1లో మెరిసిన సాయితేజ

TGPSC విడుదల చేసిన గ్రూప్-1 రిజల్ట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన నయీంనగర్కి చెందిన పులి సాయితేజ 507 మార్కులతో సత్తా చాటారు. సాయితేజ్ తండ్రి కిషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి తండ్రుల ఆశయాలకు అనుగుణంగా సాయితేజ కష్టపడి చదివి ప్రతిభ కనబరిచారు.
Similar News
News November 24, 2025
పెద్దపల్లి డీఈఓగా శారదకు అదనపు బాధ్యతలు

పెద్దపల్లి డీఈఓ డి.మాధవి సెలవుపై వెళ్లడంతో డీఈఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న జీ.శారదకు అదనపు డీఈఓ బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యా సంచాలకులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాధవి నవంబర్ 7న సెలవు దరఖాస్తు సమర్పించడంతో ఖాళీ ఏర్పడినందున ఈ తాత్కాలిక నియామకం చేపట్టారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు శారద డీఈఓగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
News November 24, 2025
కొడంగల్ వేదికగా స్థానిక ప్రచారం మొదలెట్టిన సీఎం

TG: 3-4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రచారాన్ని తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి ప్రారంభించారు. ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, మహిళలు ఆ చీరలు కట్టుకొని అభివృద్ధికి అండగా నిలిచే వారికి ఓటేయాలన్నారు. పదేళ్లు అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కాగా త్వరలోనే 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు SEC షెడ్యూల్ విడుదల చేయనుంది.
News November 24, 2025
ఆ మద్యం దుకాణాన్ని తొలగించండి: నంద్యాల కలెక్టర్

నవంబర్ 7న జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. నందికొట్కూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని మద్యం దుకాణం విద్యార్థుల్లో చెడు అలవాట్లకు దారితీస్తోందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. మద్యం దుకాణాన్ని తొలగించే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు.


