News March 12, 2025

HNK: గ్రూప్-1లో మెరిసిన సాయితేజ

image

TGPSC విడుదల చేసిన గ్రూప్-1 రిజల్ట్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన నయీంనగర్‌కి చెందిన పులి సాయితేజ 507 మార్కులతో సత్తా చాటారు. సాయితేజ్ తండ్రి కిషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి తండ్రుల ఆశయాలకు అనుగుణంగా సాయితేజ కష్టపడి చదివి ప్రతిభ కనబరిచారు. 

Similar News

News December 9, 2025

మార్కెట్‌పై Blanket కోసం blinkIt డేంజర్ మూవ్

image

క్విక్ కామర్స్ మార్కెట్‌పై పాగా వేసేందుకు blinkIt మెడిసిన్ డెలివరీ చేయడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ అప్‌లోడ్ చేయకున్నా Order And Approve పద్ధతిలో ఆర్డర్ ప్లేస్ అవుతుంది. కస్టమర్‌కు కాసేపటికి డాక్టర్ అని కాల్ చేసి మెడిసిన్ వివరాలు, అవసరం అడిగి అప్రూవ్ చేస్తున్నారు. జలుబు, జ్వరం మందులే కాదు.. బీపీ, షుగర్, నరాల సమస్యల మెడిసిన్స్ సైతం ఓ కాల్‌తో ఇచ్చేస్తున్నారు.

News December 9, 2025

మార్పు కోసం అమెరికా TO బిక్నూర్

image

మార్పు కోసం అమెరికా నుంచి బిక్కనూరు వచ్చారు మండల కేంద్రానికి చెందిన పెద్ద బచ్చ గారి మైత్రి. శ్రీధర్ రెడ్డి, మైత్రి కుటుంబం అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో మైత్రి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అక్కడి నుంచి గ్రామానికి వచ్చారు. తమను సర్పంచిగా గెలిపిస్తే అమెరికా తరహాలలో బిక్కనూర్ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

News December 9, 2025

గన్నవరం-ఢిల్లీ ఇండిగో సర్వీస్ ఈ నెల 11 వరకు రద్దు

image

విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో రెగ్యులర్ సర్వీసులను ఆపరేషనల్ కారణాల వల్ల డిసెంబర్ 11 వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ ప్రకటించింది. విమానం రద్దు కావడంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీషెడ్యూల్ లేదా రిఫండ్‌ కోసం కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని ఇండిగో సూచించింది.