News March 13, 2025
HNK: జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి: కలెక్టర్

ఇంటర్మీడియట్ పదో తరగతి వార్షిక పరీక్షలలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. నేడు హనుమకొండ హంటర్ రోడ్డులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాల(ధర్మసాగర్)ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలా రాస్తున్నారు, నీట్, ఎంసెట్లకు దరఖాస్తు చేశారా అని కలెక్టర్ జూనియర్ కళాశాల విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 21, 2025
ఎల్లారెడ్డిపేటలో దొంగనోట్ల కలకలం

ఎల్లారెడ్డిపేట మండలంలో దొంగనోట్ల చలామణి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలను అదునుగా చేసుకుని పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీని తరలించినట్లు తెలుస్తోంది. ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు, ఓటర్లకు వీటిని పంపిణీ చేసినట్లు సమాచారం. తాజాగా ఓ వ్యక్తి ఇచ్చిన నోటును గమనించిన వ్యాపారి అది నకిలీదని గుర్తించడంతో అసలు విషయం బయటపడింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారనా సమాచారం.
News December 21, 2025
KMR: తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు పుల్గం రవీందర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు కామారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతర కృషి చేస్తున్నందుకు ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలపై అందర్నీ కలుపుకొని ముందుకు వెళతానని అన్నారు.
News December 21, 2025
నాగార్జునసాగర్ నీటిమట్టం ఎంతంటే?

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి 19,472 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోందని డ్యామ్ అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 569.50 అడుగులకు (255.31 టీఎంసీలు) చేరింది. సాగునీటి అవసరాల నిమిత్తం కుడి కాలువకు 9,500 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 7,272 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి స్థిరంగా వస్తున్న నీటితో సాగర్ జలకళను సంతరించుకుంది.


