News February 11, 2025
HNK: నేటి నుంచి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్

ఓరుగల్లు జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులపాటు రద్దవుతుందని ప్రకటించిన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి కాజీపేట మీదుగా కాగజ్నగర్(ఈనెల11 నుంచి 14)కు వెళ్తుందని, మళ్లీ 12న కాగజ్నగర్ నుంచి SEC(ఈనెల 12-15)వరకు నడపనున్నట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News December 20, 2025
సిరిసిల్ల: పాడె దించి పోస్టుమార్టానికి శవం తరలింపు

పాడెపై శవాన్ని తీసుకెళ్తుండగా పోలీసులు ఆపి పోస్టుమార్టానికి తరలించిన ఘటన రాజన్నసిరిసిల్ల(D) ఎల్లారెడ్డిపేట(M) రాజన్నపేటలో శనివారం జరిగింది. ఎరుపుల నర్సయ్య(58) శుక్రవారం తన ఇంట్లో మృతిచెందాడు. గుండెపోటుతో నర్సయ్య చనిపోయాడని నమ్మించి దహన సంస్కారాలకు కుటుంబసభ్యులు ఏర్పాట్లుచేశారు. నర్సయ్య మెడ చుట్టూ నల్లగా ఉండగా అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
News December 20, 2025
సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్ మను చౌదరి

కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ మను చౌదరి తెలిపారు. రాష్ట్రపతి శీతకాల విడిది ముగించుకుని ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతుండటం, అలాగే విపత్తు నివారణ చర్యలపై జిల్లా యంత్రాంగం మాక్ డ్రిల్ ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ మార్పును గమనించి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
News December 20, 2025
ఈనెల 22న జరిగే గ్రీవెన్స్ రద్దు: జనగామ కలెక్టర్

ఈనెల 22న జరిగే ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈనెల 22న పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఉన్నందున, ఈ కార్యక్రమంలో ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందన్నారు. అందువల్ల సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు.


