News February 11, 2025

HNK: నేటి నుంచి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్

image

ఓరుగల్లు జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులపాటు రద్దవుతుందని ప్రకటించిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి కాజీపేట మీదుగా కాగజ్‌నగర్‌(ఈనెల11 నుంచి 14)కు వెళ్తుందని, మళ్లీ 12న కాగజ్‌నగర్ నుంచి SEC(ఈనెల 12-15)వరకు నడపనున్నట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Similar News

News December 18, 2025

కోరుకొల్లులో సినిమా షూటింగ్ సందడి

image

పాలకోడేరు మండలం కోరుకొల్లులో గురువారం ‘తెల్ల కాగితం’ సినిమా షూటింగ్‌ సందడి నెలకొంది. హీరో రోషన్‌, హీరోయిన్‌ వైష్ణవిలపై దర్శకుడు రమేష్‌ పలు సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్‌ను చూసేందుకు గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. చిత్ర విశేషాలు బయటకు రాకుండా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

News December 18, 2025

భీమిలి ఎమ్మెల్యే గంటాకు రాజాం ఎమ్మెల్యే వినతి

image

మధురవాడ GVMC కార్యాలయంలో భీమిలి MLA గంటా శ్రీనివాసరావు నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ గ్రీవెన్స్‌లో పాల్గొని ఎమ్మెల్యే గంటాకు వినతిపత్రం అందజేశారు. పీఎం పాలెంలోని తన కాలేజీ సమీపంలో ఉన్న స్మశానం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, దానిని మార్చాలని కోరారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని గంటా అధికారులను ఆదేశించారు.

News December 18, 2025

కనక మహాలక్ష్మి అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం

image

బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం నాల్గో గురువారం సందర్భంగా సహస్ర ఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈఓ శోభారాణి చేతులు మీదుగా అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
మార్గశిర మాసం చివరి గురువారం కావడంతో భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయం అంతా కిటకిటలాడింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈఓ శోభరాని అన్ని ఏర్పాట్లు చేశారు.