News January 29, 2025
HNK: బాలుడి గొంతు కోసిన బాలిక తండ్రి (UPDATE)

HNKలో ఓ బాలుడిపై బాలిక(17) తండ్రి దాడి చేసి గొంతు కోయగా.. బాలిక సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇంటర్ చదువుతున్న బాలిక WGLకు చెందిన ఓ బాలుడితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేరని అతడిని ఇంటికి పిలిచింది. అప్పుడే బాలిక తండ్రి ఇంటికి రాగా.. కూతురితో సన్నిహితంగా ఉన్న బాలుడి గొంతు కోశాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాలిక ఉరేసుకుంది. బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 16, 2025
‘గత ఐదేళ్లలో ఏపీకి రూ.112.67 కోట్లు మాత్రమే విడుదల’

దీనదయాళ్ దివ్యాంగజన పునరావాస పథకం (DDRS) కింద ఆంధ్రప్రదేశ్కు గత ఐదేళ్లలో రూ.112.67 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి బి.ఎల్.వర్మ తెలిపారు. 241 స్వచ్ఛంద సంస్థల ద్వారా 25,534 మంది దివ్యాంగులు లబ్ధి పొందారని చెప్పారు. లోక్సభలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశ్నకు సమాధానంగా, దివ్యాంగుల పునరావాసం, విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం ఈ పథకం కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
News December 16, 2025
పాడేరు: ‘మ్యూటేషన్ల ప్రక్రియలో అలసత్వం చేయకుండా చూడాలి’

జిల్లాలో రెవిన్యూ రీసర్వే, మ్యూటేషన్ ప్రక్రియలో అలసత్వం చేయకుండా చూడాలని ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. మరలా గ్రామ సభలు నిర్వహించే నాటికి రీసర్వే పూర్తి చేయాలన్నారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. రీ సర్వే చేసినప్పుడు ప్రభుత్వ భూములు, డీ పట్టా ల్యాండ్స్ పూర్తిగా పరిశీలించి, వెబ్ ల్యాండ్ సబ్ డివిజన్ చేయాలన్నారు.
News December 16, 2025
కామారెడ్డి: మూడో విడతలో 462 మంది సర్పంచ్ అభ్యర్థులు

కామారెడ్డి మూడో విడత ఎన్నికల్లో భాగంగా 142 గ్రామపంచాయతీ స్థానాలకు రేపు బుదవారం జరగనున్న ఎన్నికల్లో 462 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే 1,020 వార్డులకు గాను 2,790 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఎవరిని అదృష్టం వరిస్తుందో రేపటి వరకు వేచి చూడాలి.


