News March 2, 2025
HNK: మానవ అక్రమ రవాణాపై అవగాహన

మానవ అక్రమ రవాణాపై వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చెందిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఆధ్వర్యంలో వరంగల్ బిగ్ బజార్ ఉద్యోగులకు అవగాహన కల్పించారు. చిన్నారులతో ఎలాంటి పనులు చేయించుకోవద్దన్నారు. నవజాత శిశువులను అక్రమంగా దత్తత తీసుకోవడం నేరమని ఏహెచ్టీయూ ఎస్ఐ ఫిలిప్ హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే డయల్ 100 లేదా చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
Similar News
News November 16, 2025
19న పుట్టపర్తికి ప్రధాని మోదీ రాక

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19న పుట్టపర్తికి రానున్నారు. ఉదయం 9:50కి విమానాశ్రయం చేరుకుని, 10 గంటలకు సాయి కుల్వంత్ సభా మందిరంలో బాబా మహాసమాధిని దర్శించుకుంటారు. 10:20కి హిల్ వ్యూ స్టేడియంలో జరిగే సత్యసాయి జయంతోత్సవాలలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30కి కోయంబత్తూర్కు బయలుదేరనున్నట్లు పీఎంవో తెలిపింది.
News November 16, 2025
200 కొట్టినా నాన్న సంతృప్తిచెందరు: వైభవ్

యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సంచలన బ్యాటింగ్తో చెలరేగుతున్న విషయం తెలిసిందే. UAEపై వీర విహారం చేసి 32 బంతుల్లోనే <<18287840>>సెంచరీ<<>> నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి గురించి వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను 200 కొట్టినా నాన్న సంతృప్తిచెందరు. ఇంకో 10 రన్స్ చేసి ఉండేవాడినని అంటారు. అమ్మ మాత్రం సెంచరీ చేసినా, డకౌట్ అయినా సంతోషంగానే ఉంటుంది. బాగా ఆడమని చెబుతుంది’ అని BCCI ఇంటర్వ్యూలో చెప్పారు.
News November 16, 2025
కొనుగోలు కేంద్రాల్లో 4983 మెట్రిక్ టన్నుల ధాన్యం: కలెక్టర్

జిల్లాలో ఏర్పాటు చేసిన 185 వరిధాన్యం కొనుగోలు కేంద్రాకు నేటి వరకు 4983.920 మెట్రిక్ టన్నులధాన్యం చేరుకున్నట్లు ములుగు కలెక్టర్ దివాకర్ టిఎస్ వెల్లడించారు. ఇందులో 17%తేమతో 2263.840 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 2151.480 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేశామని, 112.360 మెట్రిక్ టన్నుల కొనుగోలు ధాన్యం కేంద్రాల్లో నిల్వ ఉందన్నారు. రూ.1.37 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.


