News April 8, 2025

HNK: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

image

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే లహరి ఎక్స్‌ప్రెస్ బస్సుగా గుర్తించారు. గాయాలైన వారిని చికిత్స కోసం 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 17, 2025

ముర్షిదాబాద్ అల్లర్లపై సిట్ ఏర్పాటు

image

పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఇటీవల జరిగిన అల్లర్లపై రాష్ట్ర పోలీసులు 9మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత వారం అక్కడ జరిగిన ఆందోళనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హింసకు కారకులు, తదితరాలపై ప్రభుత్వానికి సిట్ నివేదిక అందించనుంది. మరోవైపు అల్లర్లలో మృతి చెందిన ముగ్గురి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున CM మమత నష్టపరిహారం ప్రకటించారు.

News April 17, 2025

ఆసిఫాబాద్ కలెక్టర్ నేటి పర్యటన వివరాలు

image

 ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే గురువారం వాంకిడి మండలంలో పర్యటిస్తారని MRO రియాజ్ అలీ తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు మండలకేంద్రంలోని రైతువేదికలో భూ భారతీ 2025 మీద అవగాహన సదస్సులో పాల్గొంటారని పేర్కొన్నారు.  సదస్సుకు అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), RDO తదితర ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News April 17, 2025

గద్వాల: క్రికెట్ బెట్టింగ్.. ఏడుగురిపై కేసు నమోదు

image

తనగల గ్రామానికి చెందిన వీరేంద్ర ఆచారి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం మేరకు వడ్డేపల్లి ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. వీరేంద్రతో పాటు మరో ఆరుగురిపై విచారణ జరిపి కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మండలంలో క్రికెట్ బెట్టింగ్ ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, గ్రామాల్లో బెట్టింగ్ ఆడేవారి సమాచారం పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.

error: Content is protected !!