News September 6, 2025

HNK: ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో అవకతవకలు

image

హనుమకొండ జిల్లాలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో అనేక అవకతవకలు జరిగినట్లు ఉపాధ్యాయులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తొలుత గురువారం సాయంత్రం 48 మందితో విద్యాశాఖ లిస్ట్‌ను విడుదల చేసింది. అదే రోజు అర్ధరాత్రి లిస్ట్‌ను 40కి కుదించించారు. శుక్రవారం అవార్డుల కార్యక్రమ ప్రారంభంలో 55 మందికి లిస్ట్ చేరింది. ఇక అవార్డులు మాత్రం 62 మందికి ప్రదానం చేశారు. డీఈవో వాసంతి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News September 6, 2025

రైతాంగ సమస్యలపై 9న అన్నదాత పోరు: వైసీపీ

image

వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే.రాజు ఆధ్వర్యంలో శనివారం అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించారు. యూరియా కొరత, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్లుగా మార్చిందని ఆయన విమర్శించారు. ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరు నిర్వహించనున్నట్టు తెలిపారు.

News September 6, 2025

ఎం.అలమండ: పాము కాటుతో యువకుడి మృతి

image

దేవరాపల్లి మండలం ఎం.అలమండ గ్రామానికి చెందిన బుడ్డ శ్రీను(28) పాము కాటుకి గురై మృతి చెందాడు. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బహిర్భూమికి వెళ్లాడు. ఆ సమయంలో విషసర్పం ఎడమకాలిపై కాటేసింది. వెంటనే కె.కోటపాడు సీహెచ్సీకి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

News September 6, 2025

లిక్కర్ కేసు: ముగ్గురు నిందితులకు బెయిల్

image

AP: లిక్కర్ కేసు నిందితులైన ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరూ రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, ముగ్గురూ పాస్‌పోర్టు వివరాలు అందించాలంది. ఇప్పటికే ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఓటు వేసేందుకు ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రాగా, ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు.