News September 20, 2025
HNK: చావు పిలుస్తోందంటూ సూసైడ్

భర్త చెరువులో దూకి సూసైడ్ చేసుకోగా.. తను లేకుండా ఉండలేనంటూ అదే చెరువులో దూకి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఐనవోలు మండలం రాంపూర్కు చెందిన సురేంద్ర HYD రామాంతపూర్లో ఉంటున్నారు. తనను చావు పిలుస్తుందంటూ శుక్రవారం బీబీనగర్(భువనగిరి) చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా సురేంద్ర భార్య సంధ్యారాణి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు కాపాడారు.
Similar News
News September 20, 2025
మంత్రులు, న్యాయ నిపుణులతో నేడు సీఎం భేటీ

TG: స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులకు సమాచారం అందించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు గడువు దగ్గర పడుతుండటం, బీసీ రిజర్వేషన్ల అంశంలో న్యాయపరమైన ఇబ్బందులపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి న్యాయ నిపుణులు కూడా రావాలని CMO నుంచి సమాచారం ఇచ్చారు.
News September 20, 2025
అక్షర్కు గాయం.. రేపటి మ్యాచులో ఆడతాడా?

ఒమన్తో మ్యాచులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన టీమ్ ఇండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ రేపు పాక్తో జరిగే మ్యాచులో ఆడటంపై అనుమానాలున్నాయి. నిన్న బౌండరీ వద్ద క్యాచ్ కోసం ప్రయత్నిస్తుండగా అక్షర్ తలకు గాయమైంది. వెంటనే ఆయన మైదానాన్ని వీడారు. దీంతో ఆయన రేపటి మ్యాచులో పాల్గొంటారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ అక్షర్ దూరమైతే భారత్ ఇద్దరు స్పిన్నర్లతోనే (కుల్దీప్, వరుణ్) ఆడాల్సి వస్తుంది.
News September 20, 2025
Future Cityకి పునాది ఎప్పుడంటే?

TG: దసరా సందర్భంగా సెప్టెంబర్ 25 లేదా 26న రంగారెడ్డి జిల్లాలోని మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) హెడ్ ఆఫీస్కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.5 కోట్లతో ప్రీకాస్ట్ టెక్నాలజీతో కేవలం మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నాగార్జునసాగర్, శ్రీశైలం హైవేలకు అనుసంధానంగా కొత్త రోడ్డు కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.