News February 8, 2025
HNK: నిబంధనలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు: బల్దియా కమిషనర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739012605602_51895777-normal-WIFI.webp)
నిబంధనలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తామని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అన్నారు. బల్దియా పరిధిలోని హనుమకొండ వరంగల్ ప్రాంతాల్లో నిర్మాణాల అనుమతుల మంజూరు కోసం దరఖాస్థులు సమర్పించిన నేపథ్యంలో కమిషనర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు. భవన నిర్మాణ అనుమతుల కోసం హన్మకొండ పరిధిలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి కొలతలు వేసి పరిశీలించారు.
Similar News
News February 8, 2025
గండిపేట: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739018824043_51765059-normal-WIFI.webp)
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని RR జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. గండిపేట మండలం నార్సింగిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు స్వచ్ఛమైన రుచికరమైన ఆహారం అందించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News February 8, 2025
‘మీసేవ’లో రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించట్లేదు: పౌరసరఫరాలశాఖ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739025056717_367-normal-WIFI.webp)
TG: ‘మీసేవ’ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులపై పౌరసరఫరాలశాఖ క్లారిటీ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులకు ‘మీసేవ’ ద్వారా అప్లికేషన్లు స్వీకరించట్లేదని, దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేయాలని మాత్రమే ‘మీసేవ’ను కోరామని వెల్లడించింది. మార్పులు, చేర్పులకు ‘మీసేవ’ ద్వారా దరఖాస్తులు వస్తున్నాయని పేర్కొంది.
News February 8, 2025
గద్వాల: ‘పెండింగ్ ధరణీ దరఖాస్తులను పూర్తి చేయాలి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739020819243_50200164-normal-WIFI.webp)
పెండింగ్లో ఉన్న ధరణీ దరఖాస్తులను పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ నారాయణ తహశీల్దార్లకు ఆదేశించారు. శనివారం గద్వాల కలెక్టర్ కలెక్టరేట్లోని హాల్లో మండలాల తహశీల్దార్లతో ధరణి, మీ సేవ కేంద్రాలలో దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాల వివరాలు, బర్త్, డెత్ సర్టిఫికెట్లు నిర్దేశించిన కాలంలో చేయాలని సూచించారు.