News February 11, 2025

HNK: నేటి నుంచి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్

image

ఓరుగల్లు జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులపాటు రద్దవుతుందని ప్రకటించిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి కాజీపేట మీదుగా కాగజ్‌నగర్‌(ఈనెల11 నుంచి 14)కు వెళ్తుందని, మళ్లీ 12న కాగజ్‌నగర్ నుంచి SEC(ఈనెల 12-15)వరకు నడపనున్నట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Similar News

News December 19, 2025

నిర్మల్: పాఠశాల వేళలు మార్చాలి: ఎస్టీయూ

image

నిర్మల్ జిల్లాలో పెరుగుతున్న తీవ్రత చలిగాలుల దృష్ట్యా పాఠశాలల పని వేళలను మార్చాలని కోరుతూ ఎస్టీయూ(STU) ఉపాధ్యాయ సంఘం నేతలు డీఈఓ భోజన్నకు వినతిపత్రం అందజేశారు. ఉదయాన్నే పాఠశాలలకు వచ్చే విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమయాన్ని సవరించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, నేతలు వెంకటేశ్వరరావు, షేక్ నబి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

News December 19, 2025

విజయనగరం ఎస్పీ దామోదర్‌కు అవార్డు

image

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రకాశం జిల్లా మాజీ MPP వీరయ్య చౌదరి హత్య కేసును సమర్థవంతంగా ఛేదించినందుకు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ (అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ) ABCD – Award for Best in Crime Detection అవార్డు అందుకున్నారు. రాష్ట్ర DGP కార్యాలయంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా శుక్రవారం ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ కేసులో 60 క్రైమ్ టీములు ఏర్పాటు చేసిన ఎస్పీ 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.

News December 19, 2025

కామారెడ్డి: అప్రమత్తతతో ప్రాణ నష్ట నివారణ

image

అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణ నష్ట నివారణ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు సూచించారు. శుక్రవారం ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి వైపరీత్యాల నివారణ నిర్వహణ చర్యలపై జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.