News January 29, 2025
HNK: బాలుడి గొంతు కోసిన బాలిక తండ్రి (UPDATE)

HNKలో ఓ బాలుడిపై బాలిక(17) తండ్రి దాడి చేసి గొంతు కోయగా.. బాలిక సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇంటర్ చదువుతున్న బాలిక WGLకు చెందిన ఓ బాలుడితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేరని అతడిని ఇంటికి పిలిచింది. అప్పుడే బాలిక తండ్రి ఇంటికి రాగా.. కూతురితో సన్నిహితంగా ఉన్న బాలుడి గొంతు కోశాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాలిక ఉరేసుకుంది. బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 6, 2025
తిరుపతి, చిత్తూరు జిల్లాలో మార్పులు..!

నగరి నియోజకవర్గాన్ని పూర్తిగా తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. నగరి డివిజన్లోని కార్వేటినగరం, పాలసముద్రం, పలమనేరు డివిజన్లోని బంగారుపాళ్యాన్ని చిత్తూరులో కలపనున్నారు. పుంగనూరును మదనపల్లె లేదా పీలేరు డివిజన్లో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నారు. వెదురుకుప్పం, కార్వేటినగరాన్ని తిరుపతి జిల్లాలో కలపాలనే డిమాండ్ మీద చర్చ జరగలేదు. గూడూరును నెల్లూరు జిల్లాలోకి మార్చనున్నారు.
News November 6, 2025
జనగామ: పత్తి అమ్మకంలో రైతుల ఇక్కట్లు!

జిల్లాలోని ఆయా మండలాల పత్తి రైతులు పత్తి అమ్మకంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం, ఎకరానికి 7 క్వింటాల పత్తి మాత్రమే అమ్మకంలో చూపించడం, ఎంత భూమి పత్తి పై ఉందో, ఎంత భూమి వరిపై ఉందో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని కిసాన్ కపాస్ యాప్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చి పత్తి అమ్మకం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 6, 2025
గద్వాల్: మధ్యాహ్న భోజన ఛార్జీల పెంపు.. ఏజెన్సీలకు ఊరట

ప్రభుత్వం విద్యార్థుల కోసం అందించే మధ్యాహ్న భోజన పథకానికి ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ అధికారులు వెంటనే అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,227పాఠశాలల్లో 3,58,400 విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి అందిస్తున్న భోజనం కోసం పెరిగిన ధరల ప్రకారం నెలకు రూ.86 లక్షల అదనపు భారం పడనుంది. ధరలు పెరిగిన క్రమంలో ప్రభుత్వ ప్రకటనతో ఏజెన్సీలకు ఊరటనిసస్తోంది.


