News April 9, 2025

HNR మహిళకు మోదీ ప్రశంసా పత్రం 

image

తెలంగాణ నుంచి జిల్లా లీడ్ బ్యాంకులో ముద్ర లోన్ పొంది వ్యాపారంలో రాణించి ఆర్థిక స్వాలంబన సాధించిన హుజూర్‌నగర్ వాసి సృజన సురేష్ రెడ్డికి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసా పత్రం అందజేశారు. ప్రధానమంత్రి ముద్ర యోజన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సృజనను పలువురు అభినందించారు.

Similar News

News October 26, 2025

చంచల్‌గూడ జైలుకు 150 ఏళ్ల చరిత్ర

image

చంచల్‌గూడ జైలు 1876లో నిర్మించబడింది. ఈ జైలుకు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం కాలంలో పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని నేరస్తులుగా ముద్ర వేసి క్రమశిక్షణ పేరుతో అణచివేయడం జరిగేది. నవాబులు తమకు విరోధంగా ఉన్నవారిని ఇక్కడ నిర్బంధించేవారు. అప్పట్లో 70 ఎకరాల్లో విస్తరించిన ఈ జైలు కాలక్రమంలో సంస్కరణలు, నగర విస్తరణ కారణంగా ప్రస్తుతం సుమారు 30 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది.

News October 26, 2025

వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్ష వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్ది అధికారులను టెలికాన్ఫెరెన్స్ ద్వారా ఆదేశించారు. భారీ వర్షాల వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరగరాదన్నారు. దీనికోసం ముందుగా గ్రామాల్లో దండోరా, మైకు ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ, జిల్లా అధికారులకు కేటాయించిన విధులు సక్రమంగా అమలు చేయాలన్నారు.

News October 26, 2025

అత్యధిక రన్స్ చేసిన భారత ఓపెనర్‌గా రోహిత్

image

నిన్న ఆస్ట్రేలియాపై సెంచరీతో అదరగొట్టిన రోహిత్ అరుదైన రికార్డు సాధించారు. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన ఓపెనర్‌గా నిలిచారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించారు. రోహిత్ 15,787 రన్స్ చేయగా, ఆ తర్వాత సెహ్వాగ్ (15,758), సచిన్ (15,335) పరుగులు చేశారు. రోహిత్ 2007లోనే భారత్ తరఫున అరంగేట్రం చేసినా అంతగా రాణించలేదు. 2013లో ఓపెనర్ అవతారం ఎత్తాక రికార్డులు కొల్లగొట్టారు.