News August 2, 2024

HOCKEY: ఆసీస్‌పై భారత్ విజయం.. 52ఏళ్లలో తొలిసారి

image

పారిస్ ఒలింపిక్స్‌ పూల్ మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూల్ బీలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. <<-se>>#Olympics2024<<>>

Similar News

News February 4, 2026

WPL: ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్

image

WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో గుజరాత్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరింది. గుజరాత్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎల్లుండి జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, RCB జట్లు తలపడనున్నాయి.

News February 4, 2026

ఉదయాన్నే ఈ 6 పనులతో గుండె ఆరోగ్యం మీ చేతుల్లో!

image

గుండె దృఢంగా ఉండాలంటే ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగి శరీరాన్ని హైడ్రేట్ చేయాలని, చక్కెర తక్కువగా ఉన్న ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘కేవలం 5 నిమిషాల ధ్యానం, కొద్దిసేపు ఎండలో నడవడం, రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేస్తే BP కంట్రోల్‌లో ఉంటుంది. నిద్రలేవగానే కనీసం 30 నిమిషాల పాటు మొబైల్‌కు దూరంగా ఉంటే స్ట్రెస్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది’ అని చెబుతున్నారు.

News February 4, 2026

ఐదేళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం

image

APని ప్రకృతి వ్యవసాయ కేంద్రంగా మార్చాలని CM చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లలో 50 లక్షల ఎకరాల్లో 40 లక్షల మంది రైతులతో ప్రకృతి సాగు చేయించడమే లక్ష్యమన్నారు. ఏలూరులో ‘కోకో సిటీ’, లంబసింగిలో కుంకుమ పువ్వు సాగుకు శ్రీకారం చుట్టారు. విజయవాడలో ఫ్లవర్ మార్కెట్ ఏర్పాటుతో పాటు ఆన్‌లైన్ కూరగాయల డెలివరీ కోసం ‘డిజీ రైతు బజార్’, యంత్రాల బుకింగ్ కోసం ‘కిసాన్ డ్రోన్’ యాప్‌లను ప్రారంభించారు.