News August 2, 2024
HOCKEY: ఆసీస్పై భారత్ విజయం.. 52ఏళ్లలో తొలిసారి

పారిస్ ఒలింపిక్స్ పూల్ మ్యాచ్లో భారత్ సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూల్ బీలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. <<-se>>#Olympics2024<<>>
Similar News
News February 25, 2026
రేపే రష్మిక-విజయ్ పెళ్లి.. ముహూర్తం ఎన్ని గంటలకంటే?

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న పెళ్లి గడియలు దగ్గరపడ్డాయి. వేదమంత్రాల సాక్షిగా రేపు ఉదయం 8 గంటలకు రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలు వైభవంగా జరిగాయి. పెళ్లికి ముందు రష్మికకు విజయ్ తల్లి వారసత్వపు గాజులను కానుకగా ఇచ్చారట. ఇక వాళ్లు కనిపించకుండా కేవలం వేడుకల ఏర్పాట్ల ఫొటోలనే వారిద్దరూ ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారు.
News February 25, 2026
మోదీ ఇజ్రాయెల్ ట్రిప్పై రాహుల్ విమర్శలు

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. USతో ట్రేడ్ డీల్ క్యాన్సిల్ చేసుకోమని తాను సవాల్ విసిరి 24 గంటలకుపైనే అయిందని.. దీనిపై స్పందించకుండా సైలెంట్గా మోదీ ఇజ్రాయెల్ వెళ్లిపోయారని విమర్శించారు. గతంలో ఓసారి ఎప్స్టీన్ ఆదేశాలతో ఇజ్రాయెల్లో పర్యటించారని.. ఇప్పుడు ఎవరి ఆదేశాలతో మళ్లీ వెళ్లారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నరేంద్ర ‘సరెండర్’ మోదీ అంటూ PMని విమర్శించారు.
News February 25, 2026
తిరిగి జట్టులో చేరనున్న రింకూ సింగ్!

T20 WC: తండ్రికి అనారోగ్యం నేపథ్యంలో చెన్నై క్యాంప్ నుంచి రింకూ సింగ్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు జింబాబ్వేతో మ్యాచ్ నేపథ్యంలో ఇవాళ అతడు తిరిగి భారత జట్టులో చేరతారని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. అయితే రింకూ తుది జట్టులో ఉంటారా, లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. WCలో ఇప్పటిదాకా అతడు ఆడిన 5 మ్యాచుల్లో 24 రన్స్ మాత్రమే చేయడం గమనార్హం.


