News August 2, 2024
HOCKEY: ఆసీస్పై భారత్ విజయం.. 52ఏళ్లలో తొలిసారి

పారిస్ ఒలింపిక్స్ పూల్ మ్యాచ్లో భారత్ సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూల్ బీలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. <<-se>>#Olympics2024<<>>
Similar News
News February 16, 2026
ప్రపంచానికే పరిష్కారాలు చూపుతాం: మోదీ

ఢిల్లీ కేంద్రంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు జరగనున్న ‘ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఆవిష్కర్తలు, పరిశోధకులు, ఔత్సాహికుల మధ్య ఉండటంవల్ల భారతీయ ప్రతిభ, ఏఐ సామర్థ్యం గురించి అవగాహన కలుగుతోంది. అందరం కలిసి మన దేశానికే కాకుండా అనేక సమస్యలపై ప్రపంచానికే పరిష్కారాలను చూపుతాం’ అని రాసుకొచ్చారు.
News February 16, 2026
రోకో.. స్టైల్ అదుర్స్

టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వయసు పెరుగుతున్నా యంగ్గా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ 38, 37 ఏళ్ల స్టార్ ప్లేయర్ల లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రోహిత్ శర్మ బరువు తగ్గి, ఫిట్గా, స్టైలిష్గా మారిపోయారు. అటు ఇండియాకు వచ్చిన విరాట్ తనదైన స్వాగ్తో అదుర్స్ అనిపించారు.
News February 16, 2026
రేపు స్కూళ్లలో ఫ్రీగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

AP: రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలు, స్కూళ్లు, కాలేజీల్లో రేపు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరగనుంది. 1-19 ఏళ్లలోపు ఉన్న 1.11 కోట్ల మందికి ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తారు. ‘నులిపురుగుల వల్ల ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తహీనత, ఎదుగుదల లోపం వంటి సమస్యలు వస్తాయి. 400MG ఆల్బెండజోల్ మాత్రలతో వీటిని నివారించవచ్చు’ అని అధికారులు పేర్కొన్నారు.


