News August 2, 2024

HOCKEY: ఆసీస్‌పై భారత్ విజయం.. 52ఏళ్లలో తొలిసారి

image

పారిస్ ఒలింపిక్స్‌ పూల్ మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూల్ బీలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. <<-se>>#Olympics2024<<>>

Similar News

News March 9, 2026

ఇరాన్ కొత్త సుప్రీం.. US, ఇజ్రాయెల్‌కు చైనా వార్నింగ్

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నియామకంపై చైనా, రష్యా స్పందించాయి. ఈ నియామకాన్ని ఇరాన్ ఇంటర్నల్ మ్యాటర్‌గా పేర్కొన్న చైనా కొత్త లీడర్‌ను లక్ష్యంగా చేసుకోవద్దని US, ఇజ్రాయెల్‌లను హెచ్చరించింది. మరోవైపు మొజ్తబాకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందనలు తెలిపారు. ఈ కష్టకాలంలో ఇరాన్‌కు తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇరాన్ ప్రజల సపోర్ట్‌తో తండ్రి ఆశయాలను కొనసాగిస్తారని ఆశిస్తున్నామన్నారు.

News March 9, 2026

ఆయిల్ ధర $200.. ఇరాన్ వార్నింగ్!

image

బ్యారెల్ క్రూడాయిల్ ధర $200 దాటినా తట్టుకోగలమంటేనే ఈ యుద్ధ క్రీడలోకి దిగండంటూ US బేస్‌లున్న గల్ఫ్ దేశాలను IRGC అడ్వైజర్ ఇబ్రహీం జబారీ హెచ్చరించారు. ఇరాన్ తన ‘మొజాయిక్ డిఫెన్స్’ వ్యూహం ద్వారా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ టెర్మినల్స్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది. 31 ఇండిపెండెంట్ కమాండ్లు, నెలకు 10,000 డ్రోన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఇరాన్ ఏ క్షణమైనా చమురు ఎగుమతులను అడ్డుకోగలదని జబారీ హెచ్చరించారు.

News March 9, 2026

స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ₹7.5 లక్షల కోట్లు ఆవిరి

image

అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఏకంగా 753 పాయింట్ల మేర పడిపోయిన నిఫ్టీ.. మధ్యాహ్నానికి కోలుకుని 24,028(-422) వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1,353 పాయింట్లు కోల్పోయి 77,566 వద్ద స్థిరపడింది. రిలయన్స్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ స్వల్పంగా లాభపడ్డాయి. అల్ట్రాటెక్, మారుతి, SBI, టాటా స్టీల్ భారీగా నష్టపోయాయి. ₹7.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.