News August 2, 2024
HOCKEY: ఆసీస్పై భారత్ విజయం.. 52ఏళ్లలో తొలిసారి

పారిస్ ఒలింపిక్స్ పూల్ మ్యాచ్లో భారత్ సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూల్ బీలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. <<-se>>#Olympics2024<<>>
Similar News
News February 5, 2026
ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు

<
News February 5, 2026
స్వర్ణ వార్డు, గ్రామ సిబ్బందికి త్వరలో ప్రమోషన్లు

AP: స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగులకు త్వరలోనే పదోన్నతులు దక్కనున్నాయి. అర్హతలు, సీనియార్టీ, పనితీరు ఆధారంగా ప్రభుత్వం వీరికి ప్రమోషన్లు ఇవ్వనుంది. అలాగే రేషనలైజేషన్ పూర్తి చేసి ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల్లో వీరిని నియమించాలని భావిస్తోంది. ఆఫీసుల పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయి అధికారులను నియమించనుంది. దీనివల్ల ఉద్యోగులకు మేలు చేకూరి ప్రజలకు నాణ్యమైన సేవలందుతాయని భావిస్తోంది.
News February 5, 2026
వ్యవసాయ రంగం అంటే చంద్రబాబుకు చిన్నచూపు: సజ్జల

AP: వ్యవసాయ రంగంపై చంద్రబాబుకు చిన్నచూపు ఉందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం రాయలసీమకే కాకుండా రాష్ట్రానికే ఘోర అన్యాయమన్నారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పథకాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. YCP నిర్వహించిన ఛలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో సజ్జలతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.


