News August 2, 2024

HOCKEY: ఆసీస్‌పై భారత్ విజయం.. 52ఏళ్లలో తొలిసారి

image

పారిస్ ఒలింపిక్స్‌ పూల్ మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూల్ బీలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. <<-se>>#Olympics2024<<>>

Similar News

News February 9, 2026

ప్రియురాలి పెళ్లి పత్రిక చూసి బాడీబిల్డర్ సూసైడ్

image

మూడేళ్లు తనను ప్రేమించి, మరొకరితో పెళ్లికి యువతి సిద్ధమవడంతో ఓ బాడీబిల్డర్ గుండెపగిలింది. కొత్త చీర, ఆహ్వానపత్రికను పంపడంతో అతను సూసైడ్ చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. ‘మా కొడుకు కిరణ్ యువతికి ఇవ్వడానికి వాలంటైన్స్ డే గిఫ్ట్‌ను కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆమె కుటుంబానికి ఉన్న రూ.50 లక్షల అప్పును తీరుస్తానని హామీ ఇచ్చాడు’ అని పేరెంట్స్ వాపోయారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 9, 2026

చర్మాన్ని మెరిపించే జ్యూసులు

image

చలికాలంలో చర్మం పొడిబారడం, కాంతి కోల్పోవడం సాధారణం. దీని కోసం ఖరీదైన క్రీములు వాడటం కంటే.. లోపల నుంచి పోషణ అందించడం ద్వారా సహజ సౌందర్యాన్ని పెంచుకోవడం మంచిది. దీనికోసం క్యారెట్ జ్యూస్, టొమాటో జ్యూస్, బీట్‌రూట్ జ్యూస్‌, దోసకాయ జ్యూస్, పాలకూర- గ్రీన్ జ్యూస్ తాగడం వల్ల చర్మం మెరుస్తుందంటున్నారు నిపుణులు. వీటిల్లో పసుపు, అల్లం వంటివి యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు యాడ్ చేయడం మంచిదంటున్నారు.

News February 9, 2026

‘పార్లమెంటులో పేలుడు జరుగుతుంది’.. స్కూళ్లకు బాంబు బెదిరింపులు

image

ఢిల్లీలోని 10కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 8.33AMకి తొలి కాల్ వచ్చిందని, స్కూళ్లను అలర్ట్ చేసి విద్యార్థులను పంపించామని ఫైర్ సర్వీసెస్ అధికారులు తెలిపారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్‌తో తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ఢిల్లీ ఖలిస్థాన్ అవుతుంది. పంజాబే ఖలిస్థాన్. అఫ్జల్ గురు జ్ఞాపకార్థం. ఫిబ్రవరి 13న 1.11PMకు పార్లమెంటులో పేలుడు జరుగుతుంది’ అని ఈమెయిల్‌లో దుండగులు హెచ్చరించారు.