News August 2, 2024

HOCKEY: ఆసీస్‌పై భారత్ విజయం.. 52ఏళ్లలో తొలిసారి

image

పారిస్ ఒలింపిక్స్‌ పూల్ మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూల్ బీలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. <<-se>>#Olympics2024<<>>

Similar News

News February 8, 2026

కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన సూర్య కుమార్

image

T20Iల్లో సూర్య కుమార్ యాదవ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. టీమ్ ఇండియా తరఫున అత్యధిక POTMలు నెగ్గిన ప్లేయర్‌గా నిలిచారు. నిన్నటి మ్యాచులో POTM రావడంతో ఆయన ఖాతాలో అవార్డుల సంఖ్య 17కు చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ(16), రోహిత్ శర్మ(14), అక్షర్ పటేల్(8) ఉన్నారు. T20I WCలో భారత్ తరఫున అత్యధిక POTMలు గెలిచిన జాబితాలో కోహ్లీ(8), సూర్య(4), యువరాజ్(3), అశ్విన్(3), రోహిత్(3) ఉన్నారు.

News February 8, 2026

భాను సప్తమి వ్రత కథ

image

పురాణాల ప్రకారం ఇందుమతి అనే భక్తురాలు తన జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాలని వశిష్ఠ మహర్షిని వేడుకుంది. ఆయన సూచన మేరకు ఆమె భాను సప్తమి వ్రతాన్ని ఆచరించింది. సూర్యోదయ స్నానం, ఉపవాసం, సూర్య మంత్ర జపం ద్వారా ఆమె తన ఆత్మను శుద్ధి చేసుకుంది. ఆమె నిష్కల్మష భక్తికి మెచ్చిన సూర్య భగవానుడు ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ కథ సూర్యారాధన ద్వారా లభించే పరమపదాన్ని మనకు వివరిస్తుంది.

News February 8, 2026

ప్రభుత్వ సంస్థల్లో టీ ఫైబర్ మాత్రమే వాడాలని ఆదేశాలు

image

TG: ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల కార్యాలయాలన్నీ టీ ఫైబర్ ఇంటర్నెట్ వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు సంస్థల ఇంటర్నెట్ వాడకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,484 సంస్థలు టీ ఫైబర్‌ను వినియోగిస్తున్నాయి. 26 జిల్లాల్లోని 8,895 గ్రామపంచాయతీలకు ఈ నెట్‌వర్క్ విస్తరించింది. ఈ సేవలకు వన్ టైం పేమెంట్ రూ.9500 చెల్లించాలి.