News August 2, 2024
HOCKEY: ఆసీస్పై భారత్ విజయం.. 52ఏళ్లలో తొలిసారి

పారిస్ ఒలింపిక్స్ పూల్ మ్యాచ్లో భారత్ సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూల్ బీలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. <<-se>>#Olympics2024<<>>
Similar News
News March 6, 2026
23న నక్కపల్లి స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన

AP: అనకాపల్లి(D) నక్కపల్లిలో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23వ తేదీ ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థల ఆధ్వర్యంలో భూమిపూజ చేయనున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ వెల్లడించారు. రూ.1.5లక్షల కోట్ల అంచనాతో ప్లాంట్ నిర్మాణం జరగనుండగా, తొలి విడతలో రూ.80వేల కోట్లతో పనులు స్టార్ట్ అవుతాయని చెప్పారు. 2029 నాటికి మొదటి దశ పూర్తి చేయడమే లక్ష్యమన్నారు.
News March 6, 2026
యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన కోడి గుడ్ల ధర!

అమెరికా-ఇజ్రాయెల్vsఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం మన దేశంలోని పౌల్ట్రీ రంగంపైనా పడింది. రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో కోడి గుడ్ల నిల్వలు పెరిగి ధరలు దారుణంగా పడిపోయాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్కో గుడ్డు ధరను రూ.4.30గా నిర్ణయించగా, స్థానిక మార్కెట్లలో రూ.3.50 పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది.
News March 6, 2026
నేటి నుంచి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ నేడు ప్రారంభంకానుంది. జూన్ 12 వరకు 99 రోజుల పాటు ఈ ప్రొగ్రామ్ ఉంటుంది. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, క్రీడలు, యువత, నైపుణ్యాలు వంటి అంశాలపై విడతల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక ఈరోజు నుంచి 15వ తేదీ వరకు పరిసరాల శుభ్రత, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ పరిష్కారంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు.


