News August 2, 2024
HOCKEY: ఆసీస్పై భారత్ విజయం.. 52ఏళ్లలో తొలిసారి

పారిస్ ఒలింపిక్స్ పూల్ మ్యాచ్లో భారత్ సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూల్ బీలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. <<-se>>#Olympics2024<<>>
Similar News
News January 22, 2026
రేపు సూర్య భగవానుడిని ఆరాధిస్తే..?

వసంత పంచమి రోజున సూర్యుడిని కూడా ఆరాధిస్తారు. బిహార్లోని దేవ్-సూర్య దేవాలయంలో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. చలికాలపు చీకట్లను పారద్రోలి, వెలుగును, వెచ్చదనాన్ని ఇచ్చే సూర్యుడు జీవరాశికి ప్రాణాధారం. సూర్యరశ్మి వల్లే పూలు పూసి, పండ్లు కాస్తాయి. నేడు ప్రజలు సూర్యుడిని కీర్తిస్తారు. నృత్యాలు చేస్తారు. ఆయన శక్తి మనలో కొత్త ఉత్సాహాన్ని నింపి, మనం చేపట్టే పనుల్లో విజయం సాధించేలా ప్రేరేపిస్తుందని నమ్మకం.
News January 22, 2026
బంగారు, వెండి ఆభరణాలు పింక్ కలర్ పేపర్లో ఎందుకు?

పింక్ కలర్ బంగారాన్ని మరింత మెరిసేలా చేసి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంది. అలాగే పలు సైంటిఫిక్ రీజన్సూ ఉన్నాయి. బంగారం, వెండి సెన్సిటివ్ మెటల్స్. గాలి, తేమ తగిలితే దీర్ఘకాలంలో సహజత్వాన్ని కోల్పోతాయి. ప్రింటెడ్ పేపర్లలో రసాయనాలు ఉండటంతో దీర్ఘకాలంలో ఆభరణాలకు డ్యామేజ్ జరుగుతుంది. దీన్నే ఆక్సిడేషన్ అంటారు. పింక్ పేపర్లో సల్ఫర్, యాసిడ్, బ్లీచ్ ఉండవు. దీనివల్ల ఆభరణాలకు ఎలాంటి కెమికల్ రియాక్షన్ ఉండదు.
News January 22, 2026
మూగజీవాలను చంపేవారిపై కఠిన చర్యలు: సీతక్క

TG: మూగజీవాలకు విషమిచ్చి చంపడం దారుణమని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు. పలు చోట్ల వీధికుక్కలకు విషమిచ్చి చంపిన ఘటనలు తన దృష్టికి వచ్చాయన్నారు. సమస్యకు పరిష్కారం చట్టబద్ధంగా, శాస్త్రీయంగా జరగాలని, సొంత నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. RRలోని యాచారంలో 100 కుక్కలకు విషమిచ్చిన ఘటన వెలుగు చూడగా, కామారెడ్డిలో కోతులను చంపిన ఘటనలో పలువురిపై కేసు నమోదైంది.


