News August 2, 2024
HOCKEY: ఆసీస్పై భారత్ విజయం.. 52ఏళ్లలో తొలిసారి

పారిస్ ఒలింపిక్స్ పూల్ మ్యాచ్లో భారత్ సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూల్ బీలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. <<-se>>#Olympics2024<<>>
Similar News
News March 4, 2026
కామారెడ్డి: ఇంటర్ పరీక్షల్లో 97.91 శాతం హాజరు

కామారెడ్డి ఇంటర్మీడియట్ పరీక్షల్లో బుధవారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 97.91 శాతం విద్యార్థులు హాజరైనట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. మొత్తం 8,183 మంది విద్యార్థులకు గాను, 8,012 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. 171 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయన్నారు.
News March 4, 2026
పవర్గ్రిడ్ 188 పోస్టులకు నోటిఫికేషన్

పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 188 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ(BE, BTech), MBA, MSW, BA(హిందీ)అర్హతగల అభ్యర్థులు మార్చి 11 వరకు NATS/NAPS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఐటీఐ అభ్యర్థులకు స్టైపెండ్ నెలకు రూ.13,500, డిప్లొమా అభ్యర్థులకు రూ.15వేలు, డిగ్రీ అభ్యర్థులకు రూ.20,000 చెల్లిస్తారు. వెబ్సైట్: https://powergrid.in
News March 4, 2026
ALERT.. ఈ ఇన్సులిన్ వాడకండి: CDSCO

ఇండియాలో షుగర్ పేషంట్లు ఎక్కువగా వాడే ‘Lantus SoloStar’ ఇన్సులిన్ మందుల బ్యాచ్ (NO. 5F0347B) ఒడిశాలో చోరీకి గురైంది. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త హెచ్చరిక జారీ చేసింది. ఈ ఇన్సులిన్ను 2°C నుంచి 8°C మధ్య భద్రపరచాలి. సరైన ఉష్ణోగ్రత లేకపోతే మందు శక్తి కోల్పోయి రోగుల ప్రాణాలకు ముప్పు కలగవచ్చు. మందు కొనే సమయంలో బ్యాచ్ నంబర్ చెక్ చేయాలని అధికారులు సూచించారు. share it


