News August 2, 2024
HOCKEY: ఆసీస్పై భారత్ విజయం.. 52ఏళ్లలో తొలిసారి

పారిస్ ఒలింపిక్స్ పూల్ మ్యాచ్లో భారత్ సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూల్ బీలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. <<-se>>#Olympics2024<<>>
Similar News
News February 16, 2026
గాలిలో బిల్గేట్స్ విమానం చక్కర్లు!

AP: బిల్గేట్స్ విమానం ల్యాండింగ్కు సమస్య తలెత్తింది. విజయవాడ విమానాశ్రయం వద్ద దట్టంగా పొగమంచు అలుముకోవడంతో ల్యాండింగ్ సాధ్యపడట్లేదు. దీంతో ఫ్లైట్ విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతోంది. సేఫ్ ల్యాండింగ్కు అనుకూల వాతావరణం కోసం పైలట్ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ బిల్గేట్స్ అమరావతిని సందర్శించాల్సి ఉంది.
News February 16, 2026
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేంద్రం నుంచి రూ.564 కోట్లు!

TG: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బకాయిల విడుదలకు కేంద్రం ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఫండ్స్ విషయమై హౌసింగ్ అధికారులు ఢిల్లీ వెళ్లగా రూ.564 కోట్ల రిలీజ్కు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్రంలో 1.45 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమవ్వగా 60వేల పంపిణీ పూర్తయింది. మరో 30వేలు పంపిణీకి సిద్ధమవ్వగా మిగతావి నిర్మాణంలో ఉన్నాయి. కేంద్రం నిధులు ఇస్తే నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశముంది.
News February 16, 2026
కొబ్బరి చెట్లకు నీరు ఇలా అందిస్తే మంచిది

కొబ్బరి తోటల్లో నేల తేమ ఆరకుండా, భూమి స్వభావాన్ని, వాతావరణాన్ని బట్టి నీటిని సక్రమంగా అందించాలి. డెల్టా ప్రాంతాల్లో నీటిని తోటలలో పారించే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో సేద్యపు నీరు ఎక్కువగా వృథా అయ్యి తెగుళ్లు కూడా తొందరగా ఇతర మొక్కలకు వ్యాపించే అవకాశం ఉంది. చెట్ల చుట్టూ పళ్లెం చేసి బేసిన్ పద్ధతి ద్వారా లేదా డ్రిప్ విధానంలో తోటలకు నీటిని అందించడం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చు.


