News September 15, 2024

SEP 17ని విమోచన దినోత్సవంగా నిర్వహించండి: బండి

image

TG: సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా కాకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. కేంద్రం కూడా అదే పేరుతో నిర్వహిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారి చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. అప్పటి రజాకర్లే దళమే..ప్రస్తుతం MIM పార్టీగా అవతరించిందన్నారు.

Similar News

News October 26, 2025

భోజనం చేశాక ఈ శ్లోకం పఠిస్తే..?

image

రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినామ్ |
అర్థినాముదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు ||
భోజనం చేసిన తర్వాత ఈ శ్లోకం పఠిస్తే దానధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మనం తినడానికి ముందు ఆకలి, దాహంతో ఉన్నవారిని గుర్తు చేసుకొని, కరుణతో కొన్ని మెతుకులు పక్కన పెట్టాలి. ఫలితంగా వారి ఆకలి తీరేలా సానుకూల శక్తులు తోడ్పడతాయని అంటున్నారు. వారి కోర్కెలు తీర్చిన పుణ్యం మనకు దక్కుతుందని నమ్మకం.

News October 26, 2025

అతివలకు తోడుగా ఈ టోల్‌ఫ్రీ నంబర్లు

image

బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశాయి. గృహహింస, లైంగిక వేధింపులు, ఆడపిల్లల అక్రమరవాణా నిరోధించేందుకు 181, బాల్యవివాహాలను నిరోధించేందుకు 1098, వేధింపుల నియంత్రణకు షీటీం, ప్రసూతి సేవలకు అంబులెన్స్‌ కోసం 102, అంగన్‌వాడీ హెల్ప్‌లైన్‌ కోసం 155209 నంబర్లను అత్యవసర సమయాల్లో సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

News October 26, 2025

బస్సు ప్రమాదం.. బైకును తొలగిస్తే 19 మంది బతికేవారు!

image

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు మరో 3 బస్సులు రోడ్డుపై పడిపోయిన బైకును చూసి పక్క నుంచి వెళ్లాయి. కానీ ఆ <<18106434>>బైకును<<>> రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం చేయలేదు. అలా చేసి ఉంటే ఈ ఘోర ప్రమాదం తప్పేది. 19 మంది ప్రాణాలతో ఉండేవారు. డ్రైవర్ ఆ బైకుపై నుంచి బస్సును పోనిచ్చాడు. మంటలు చెలరేగగానే భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రయాణికులకు సమాచారం ఇచ్చినా అందరూ బస్సు దిగి ప్రాణాలు రక్షించుకునేవారు.