News March 25, 2024
HOLI: గాయాలున్నాయా? ఇలా చేయండి

రేపు హోలీ. సంబరాలకు అంతా సిద్ధమయ్యారు. అయితే రంగులు పూసుకునేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరవొద్దు. ముఖ్యంగా శరీరంపై గాయాలున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీకు శరీరంపై గాయాలు ఉంటే వాటిపై బ్యాండేజ్ వేసుకోండి. దీనివల్ల రంగులు గాయాన్ని చేరకుండా ఉంటాయి. సహజమైన రంగులతో హోలీ ఆడినా ఈ జాగ్రత్త తీసుకోవడం మంచిది. ముఖంపై దద్దుర్లు, తామర వంటివి ఉంటే మొదట ఆయింట్మెంట్, ఆ తర్వాత నూనె రాసుకోండి.
Similar News
News November 28, 2025
నేడు క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరగనుంది. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్, SIPBలో ఆమోదం పొందిన పలు ప్రాజెక్టులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాలపైనా సమగ్రంగా చర్చిస్తారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల సన్నద్ధతమైనా చర్చించే అవకాశం ఉంది.
News November 28, 2025
నేడు క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరగనుంది. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్, SIPBలో ఆమోదం పొందిన పలు ప్రాజెక్టులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదిరిన ఒప్పందాలపైనా సమగ్రంగా చర్చిస్తారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల సన్నద్ధతమైనా చర్చించే అవకాశం ఉంది.
News November 28, 2025
వైకుంఠ ద్వార దర్శనం నేరుగా వెళ్లి చేసుకోవచ్చా?

వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు నేరుగా వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి ప్రత్యేక టికెట్లు అవసరం లేదు. ఈ 7 రోజుల పాటు భక్తులు నేరుగా క్యూలైన్లలోకి ప్రవేశించి, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుచుకునే వైకుంఠ ద్వారం గుండా ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. అయితే DEC 30, 31, JAN 1 తేదీలలో టికెట్లు లేకుండా కొండపైకి వస్తే స్వామివారి దర్శనానికి అనుమతి ఉండదు.


