News March 17, 2024
వాలంటీర్లు రూల్స్ అతిక్రమిస్తే ఇంటికే: కడప కలెక్టర్

గ్రామ/వార్డు వాలంటీర్లు రాజకీయ నేతలతో తిరిగిన, పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయరామరాజు హెచ్చరించారు. కడపలో శనివారం ఎస్పీ, కమిషనర్తో కలిసి ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. వాలంటీర్లు రూల్స్ అతిక్రమించినట్లు ఎవరైన ఫిర్యాదు చేస్తే వారిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తామన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలన్నారు.
Similar News
News September 3, 2025
AUTO MATE యాప్ను రూపొందించిన ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు

విద్యార్థులు ఎదుర్కొనే ఆటో సమస్యలను పరిష్కరిస్తూ ప్రయాణ సులభతరం, భద్రత, తదితర అంశాలపై ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు AUTO MATE యాప్ను రూపొందించారు. E- CELL ఆధ్వర్యంలో R21 బ్యాచ్ విద్యార్థులు (శివశంకర్, సాయినాథ్, రవితేజ, అంకిత్ కుమార్, సాయికుమార్, మణికుమార్) యాప్ రూపకల్పన చేశారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా యాప్ పరీక్షించి అధికారికంగా ఆవిష్కరించారు. యాప్ చాలా ఉపయోగకరంగా ఉందని వారిని అభినందించారు.
News September 3, 2025
AUTO MATE యాప్ను రూపొందించిన ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు

విద్యార్థులు ఎదుర్కొనే ఆటో సమస్యలను పరిష్కరిస్తూ ప్రయాణ సులభతరం, భద్రత, తదితర అంశాలపై ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు AUTO MATE యాప్ను రూపొందించారు. E- CELL ఆధ్వర్యంలో R21 బ్యాచ్ విద్యార్థులు (శివశంకర్, సాయినాథ్, రవితేజ, అంకిత్ కుమార్, సాయికుమార్, మణికుమార్) యాప్ రూపకల్పన చేశారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా యాప్ పరీక్షించి అధికారికంగా ఆవిష్కరించారు. యాప్ చాలా ఉపయోగకరంగా ఉందని వారిని అభినందించారు.
News September 3, 2025
బెంగుళూరుకు పయనమైన వైఎస్ జగన్

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో మూడు రోజుల పర్యటన ముగించుకుని బెంగళూరుకు పయనమయ్యారు. బుధవారం పులివెందుల పట్టణంలోని స్థానిక భాకరాపురంలో ఉన్న హెలిప్యాడ్ వద్దకు ఆయన చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా నాయకులు వీడ్కోలు పలికారు.