News March 17, 2025
బంగ్లా, రోహింగ్యాల నెట్వర్క్పై దర్యాప్తునకు సిద్ధమైన హోంశాఖ

అక్రమ వలసదారులు, వారు స్థిరపడేందుకు సాయపడుతున్న వారిపై దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ సిద్ధమైంది. ఇప్పటికే ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా బంగ్లాదేశీయులు, రోహింగ్యాల గుర్తింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. NIA, పోలీసులు చాలామందిని అరెస్టు చేసి డిటెన్షన్ క్యాంపులకు తరలించారు. అసలు వారెలా దేశంలో చొరబడ్డారు, వారికి ఎవరు సాయం చేశారు, గుర్తింపు పత్రాలు ఎవరు ఇప్పించారన్న కోణంలో దర్యాప్తు చేపట్టనున్నారు.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


