News August 14, 2024
గుంపు మేస్త్రి గారికి స్వదేశాగమన శుభాకాంక్షలు: BRS

TG: విదేశీ పర్యటన నుంచి ఇవాళ తిరిగివస్తున్న CM రేవంత్ రెడ్డికి BRS పార్టీ సెటైరికల్ స్వాగతం పలికింది. ‘పది రోజుల US పర్యటనలో సోదరుడు ఎనుముల జగదీశ్ రెడ్డి గారు నూతనంగా స్థాపించిన కంపెనీతో రూ.1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుని నేడు స్వదేశానికి తిరిగివస్తున్న మా గుంపు మేస్త్రి గారికి స్వదేశాగమన శుభాకాంక్షలు. ఇట్లు బ్యాగ్మ్యాన్ ఫ్యాన్స్ అసోసియేషన్’ అని ఈ బ్యానర్ను Xలో పోస్ట్ చేసింది.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


