News May 12, 2024

సివిల్ సర్వీస్ వ్యవస్థలో నిజాయతీ తగ్గింది: దువ్వూరి

image

భారత్‌లోని సివిల్ సర్వీసులు, IAS వ్యవస్థలో నీతి, నిజాయతీ తగ్గుతోందని RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆరోపించారు. ఈ వ్యవస్థను సంస్కరించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన రాసిన ఓ పుస్తకంలో IAS వ్యవస్థ ప్రక్షాళనపై తన అభిప్రాయాలను రాసుకొచ్చారు. ఏనాడో బ్రిటిషు వారు తయారు చేసిన IAS అనే స్టీల్ ఫ్రేమ్ ఇప్పుడు తుప్పుపట్టిందన్నారు. దీన్ని సరిచేసి పూర్వవైభవం తేవాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News

News November 27, 2025

డెలివరీ తర్వాత ఈ లక్షణాలున్నాయా?

image

డెలివరీ తర్వాత మహిళల్లో అనేక మార్పులు వస్తాయి. జుట్టు ఎక్కువగా రాలడం, శారీరక మార్పులు, వాపు, మలబద్ధకం, కాళ్లు, పాదాల్లో వాపు వంటి సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించాలంటే పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఇవి కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి. కానీ ఎన్ని రోజులైనా వీటి నుంచి ఉపశమనం లభించకపోతే, అశ్రద్ధ చేయకుండా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.

News November 27, 2025

బాధ్యతలకు విరుద్ధంగా గవర్నర్ కామెంట్స్: CM స్టాలిన్

image

తమిళనాడులో లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయని, రాష్ట్రం ఉగ్రవాద ధోరణితో ఉందని గవర్నర్ ఆర్‌ఎన్ రవి కామెంట్స్‌ను సీఎం స్టాలిన్ తప్పుబట్టారు. ఉగ్ర దాడుల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడలేని కేంద్రాన్ని అదే పనిగా ఆయన ప్రశంసిస్తున్నారని CM మండిపడ్డారు. శాంతికి నిలయమైన తమిళనాడును ఉగ్రవాద రాష్ట్రమంటున్న గవర్నర్‌ అహంకారాన్ని అణిచివేస్తామన్నారు. బాధ్యతలకు విరుద్ధంగా గవర్నర్ కామెంట్స్ ఉన్నాయని CM మండిపడ్డారు.

News November 27, 2025

మీ ఇంట్లో ‘దక్షిణామూర్తి’ చిత్రపటం ఉందా?

image

శివుడి జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి. ఇంట్లో ఆయన చిత్రపటం ఉంటే అది సకల శుభాలు, అష్టైశ్వర్యాలకు మార్గమని పండితులు, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అపమృత్యు దోషాలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు ఆయనను ఆరాధిస్తారు. దక్షిణామూర్తి దర్శనంతో పిల్లల్లో విద్యా బుద్ధులు వికసించి, జ్ఞానం, ఏకాగ్రత సిద్ధిస్తాయని నమ్మకం.
☞ దక్షిణామూర్తి విగ్రహాన్ని ఇంట్లో ఏ రోజున ప్రతిష్ఠించాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.