News March 19, 2024
పరువు హత్యా? ప్రియుడే చంపాడా?
TG: రంగారెడ్డి(D) దండుమైలారంలో ఇంజినీరింగ్ విద్యార్థిని భార్గవి(19) హత్య సంచలనంగా మారింది. శశి అనే యువకుడిని ప్రేమించినందుకు ఆమెను తల్లి కొట్టి చంపినట్లు భార్గవి సోదరుడు ఫిర్యాదు చేశాడు. మరోవైపు తమ కూతురికి బావతో పెళ్లి చేద్దామని నిర్ణయించడంతో తాము ఇంట్లో లేని సమయంలో శశి వచ్చి చంపేశాడని భార్గవి తండ్రి ఆరోపిస్తున్నాడు. దీంతో అమ్మాయి హత్యపై 2 కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 30, 2024
DSC అభ్యర్థులకు BIG ALERT
TG: DSCలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 5వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగనుంది. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఫోన్లో సమాచారం అందిస్తారు. ఎంపికైన వారి జాబితాను DEOలు ప్రకటిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల ఫొటో కాపీలతో హాజరుకావాలి.
News September 30, 2024
కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా: హరీశ్
TG: మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అని హరీశ్ రావు గుర్తుచేశారు. ‘మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరు. ఈ విషయంలో BRS పార్టీ అయినా, వ్యక్తిగతంగా నేనైనా ఉపేక్షించబోము. కొండా సురేఖకు కలిగిన <<14234406>>అసౌకర్యానికి <<>>చింతిస్తున్నా. సోషల్ మీడియాలో ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నా. అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నా’ అని హరీశ్ ట్వీట్ చేశారు.
News September 30, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, VZM, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, ATP, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంది.