News April 7, 2024

మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా: కిషన్ రెడ్డి

image

TG: గత బీఆర్ఎస్ పాలనలో ప్రజల సమస్యలను కేసీఆర్ పట్టించుకోలేదని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. మోదీ నాయకత్వంలో తాము సమర్థవంతంగా పనిచేశామని చెప్పారు. కరోనా సమయంలోనూ మోదీనే పేదలను ఆదుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న భారత్‌ను మూడో స్థానానికి తీసుకెళ్తామన్నారు.

Similar News

News December 26, 2025

మానసిక ధైర్యాన్ని అందించే మహాకాళి అమ్మవారు

image

దశమహావిద్యలలో మొదటి రూపమైన శ్రీ మహాకాళీ దేవి శక్తికి, పరివర్తనకు ప్రతిరూపం. కృష్ణ వర్ణంతో ప్రకాశించే ఈమెను ఆరాధిస్తే సకల వ్యాధులు, గ్రహ దోషాలు, శత్రుపీడలు తొలగిపోతాయని నమ్మకం. తంత్రోక్త మార్గంలో ఈ మహావిద్యను ఉపాసించే వారికి మానసిక ధైర్యం, సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయువు సిద్ధిస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో విజయం లభిస్తుంది. సాధకులకు రక్షణ కవచంలా నిలిచి, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది.

News December 26, 2025

వంట గ్యాస్ సిలిండర్ లీకైతే..

image

*LPG లీకైతే కుళ్లిన గుడ్లు లేదా సల్ఫర్ లాంటి వాసన వస్తుంది
*గ్యాస్ లీకైన వెంటనే సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయండి
*చిన్న స్పార్క్ కూడా పేలుడుకు కారణం అవ్వొచ్చు. అందుకే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ స్విచ్‌లు ఆన్/ఆఫ్ చేయొద్దు.
*డోర్లు, కిటికీలు తెరవండి. దీనివల్ల గ్యాస్ బయటకు వెళ్తుంది.
*లీక్ అవుతూనే ఉంటే ఇంటి నుంచి బయటకు వెళ్లండి. ఎమర్జెన్సీ నంబర్ 1906కి కాల్ చేయండి
Share it

News December 26, 2025

మన కరెంటుతోనే బంగ్లాదేశ్‌కు వెలుగు.. స్విచ్ ఆఫ్ చేస్తే..!

image

చేసిన సాయాన్ని మరచి, స్థాయికి మించిన మాటలతో భారత్‌ను కవ్విస్తోంది బంగ్లాదేశ్. కానీ గ్యాస్ కొరత, ప్లాంట్లలో సమస్యలతో కరెంటు కోసం మనపైనే ఆధారపడుతోంది. ఏడాదిలో ఇది 70% పెరిగింది. బంగ్లాకు అవసరమైన మొత్తం విద్యుత్‌లో 17% మనమే సరఫరా చేస్తున్నాం. సగటున రోజూ 2,300 MW సప్లై జరుగుతోంది. ఇందులో అగ్రభాగం అదానీ పవర్ ద్వారా సాగుతోంది. బంగ్లా ఇలానే తోక జాడిస్తే.. మనం ‘స్విచ్’ ఆఫ్ చేస్తే చాలు. మీరేమంటారు?