News February 7, 2025
ఘోరం.. బాలికపై సామూహిక అత్యాచారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738917419705_893-normal-WIFI.webp)
TG: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఐదుగురు యువకులు దారుణానికి పాల్పడ్డారు. ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 7, 2025
కశ్మీర్లో ఏడుగురు చొరబాటుదారులు హతం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738924943818_1032-normal-WIFI.webp)
దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఏడుగురిని భారత సైనికులు హతమార్చారు. వీరిలో ముగ్గురు పాక్ సైనికులు, నలుగురు టెర్రరిస్టులు కావొచ్చని ఆర్మీ అనుమానిస్తోంది. జమ్మూ కశ్మీర్లోని పూంఛ్ జిల్లా కృష్ణ ఘాటీ సెక్టార్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎల్వోసీ దాటి ఇండియన్ ఫార్వర్డ్ పోస్ట్పై దాడికి యత్నించడంతో భారత సైనికులు కాల్పులు జరిపారు.
News February 7, 2025
మీ బ్యాంకు వడ్డీరేటు తగ్గించకుంటే ఏం చేయాలంటే..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738921091534_1199-normal-WIFI.webp)
RBI కత్తిరించిన 25bps వడ్డీ ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు అందించాలి. అయితే కొన్ని పట్టించుకోకపోవచ్చు. కొన్ని కొంతే తగ్గించొచ్చు. అలాంటప్పుడు మీ హోమ్లోన్ EMI తగ్గించుకొనేందుకు ఓ దారుంది. అదే తక్కువ వడ్డీ వసూలు చేసే బ్యాంకుకు మీ లోన్ బదిలీ చేసుకోవడం. దీనినే రీఫైనాన్సింగ్ అంటారు. ఈ పోటీ వాతావరణంలో కస్టమర్ను వదులుకొనేందుకు ఏ బ్యాంకూ ఇష్టపడదు. మీరు బార్గెయిన్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు.
News February 7, 2025
YCP మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు సీజ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738924262771_1032-normal-WIFI.webp)
AP: విశాఖపట్నం వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వైజాగ్లోని రూ.44.74 కోట్ల విలువైన హయగ్రీవ ఆస్తులు అటాచ్ చేసింది. కాగా వృద్ధులు, అనాథలకు సేవ చేసేందుకు కేటాయించిన హయగ్రీవ భూములను ఆయన దుర్వినియోగం చేసినట్లు ఈడీ గతంలో తేల్చింది. ప్లాట్లుగా విభజించి వేర్వేరు వ్యక్తులకు తప్పుడు పత్రాలతో విక్రయించినట్లు గుర్తించింది.