News February 6, 2025
ఘోరం.. భర్త ఇంటిని అమ్మి ప్రియుడితో భార్య పరార్
భర్త కిడ్నీని అమ్మి ప్రియుడితో <<15341180>>పారిపోయిన ఘటన<<>> మరువకముందే అదే తరహాలో మరో ఉదంతం బయటకొచ్చింది. తమిళనాడు కన్యాకుమారి(D)లో బెంజమిన్(47), సునీత(45) దంపతులు. భర్త సౌదీలో పనిచేస్తుండగా, ఇంటివద్దే ఉన్న భార్య మరొకరితో సంబంధం పెట్టుకుంది. ఇటీవల భర్త ఇంటిని అమ్మేసి డబ్బుతో పారిపోయింది. దీంతో భర్త సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 6, 2025
పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల
TG: పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 10న ఎడ్ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 1న రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. మరోవైపు మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. MAR 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. జూన్ 11-14 వరకు పరీక్షలు నిర్వహించనుంది.
News February 6, 2025
సైఫ్ అలీఖాన్ కేసులో కీలక పరిణామం
కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కేసులో కీలక పురోగతి లభించింది. దాడి చేసిన నిందితుడిని సైఫ్ సిబ్బంది గుర్తించారు. పోలీసులు నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్లో నిందితుడిని వారు స్పష్టంగా గుర్తించి చూపించారు. సైఫ్పై దాడి చేసింది అతడేనని పోలీసులకు తెలిపారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బంగ్లాదేశ్కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
News February 6, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్, పేసర్ హేజిల్వుడ్ దూరమైనట్లు ICC ప్రకటించింది. మడమ గాయంతో కమిన్స్, తుంటి సమస్యతో హేజిల్ ఆడటం లేదని పేర్కొంది. ఇప్పటికే గాయం కారణంగా మిచెల్ మార్ష్ వైదొలగగా, స్టొయినిస్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ నలుగురు కీలక ప్లేయర్ల స్థానంలో మరో నలుగుర్ని AUS క్రికెట్ బోర్డు ఎంపిక చేయాల్సి ఉంది. ఈనెల 19 నుంచి CT స్టార్ట్ కానుంది.