News January 6, 2025
ఘోరం.. పిల్లలకు విషమిచ్చి పేరెంట్స్ ఆత్మహత్య

బెంగళూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్, అతని భార్య తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసి తామూ ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అనూప్ కుమార్(38), రాఖీ(35), అనుప్రియ(5), ప్రియాంశ్(2)గా గుర్తించారు. వీరి స్వస్థలం యూపీలోని ప్రయాగ్ రాజ్ అని పోలీసులు తెలిపారు. తీవ్ర ఆర్థిక సమస్యలతోనే సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.
Similar News
News January 7, 2026
శని ప్రభావంతో వివాహం ఆలస్యం

జాతక చక్రంలో వివాహ స్థానంపై శని ప్రభావం ఉంటే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. శని మందగమన గ్రహం కావడంతో ప్రతి విషయంలోనూ జాప్యం జరుగుతుంది. దీనికి పరిష్కారంగా ప్రతి శనివారం శివాలయంలో నల్ల నువ్వులతో దీపారాధన చేయాలి. ‘శని గవచం’ పఠించడం, పేదలకు ఆహారం లేదా వస్త్ర దానం చేయడం వల్ల శని ప్రసన్నుడవుతాడు. ముఖ్యంగా హనుమంతుడిని పూజించడం వల్ల శని దోషాలు తొలగి, వివాహ మార్గం సుగమం అవుతుంది.
News January 7, 2026
NIT వరంగల్లో JRF పోస్టులు

<
News January 7, 2026
టమాటా దిగుబడి ఎక్కువైతే అక్కడి రైతులు ఏం చేస్తారంటే?

మన దగ్గర టమాటా దిగుబడి ఎక్కువై, సరైన గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఆగ్రహంతో, బాధతో పంటను రోడ్ల పక్కన పడేయడం చూస్తుంటాం. ఇటలీ, చైనా వంటి దేశాల్లో మాత్రం టమాటాలకు ధర లేకుంటే వాటిని నీటితో శుభ్రపరిచి, రెండుగా కోసి ఎండ తీవ్రంగా ఉన్నచోట ఆరబెడతారు. అవి రుచి కోల్పోకుండా, ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఆ ముక్కలపై ఉప్పు చల్లుతారు. అవి బాగా ఎండిపోయాక, ప్యాకింగ్ చేసి మార్కెట్లలో అమ్మి ఆదాయాన్ని పొందుతారు.


