News March 18, 2024
ఘోరం.. చెవి కమ్మలు కొనలేదని భర్తకు నిప్పు

TG: ఖమ్మంలో దారుణం జరిగింది. చెవి కమ్మలు కొనలేదనే కోపంతో భర్తకు భార్య నిప్పంటించింది. తీవ్ర గాయాలతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనకు చెవి కమ్మలు కొనివ్వాలని భర్త యాకూబ్ పాషాతో సమీనా నిత్యం గొడవ పడుతూ ఉండేదని పోలీసులు తెలిపారు. తన దగ్గర డబ్బు లేదని, కొనలేనని పాషా చెప్పడంతో భార్య ఆగ్రహానికి గురై నిప్పంటించిందని చెప్పారు.
Similar News
News January 2, 2026
వరి మాగాణి మినుమును ఆశించే తెగుళ్లు

రబీ కాలంలో వరి మాగాణి భూముల్లో నాటిన మినుము పంటకు అనేక తెగుళ్ల బెడద ఉంటుంది. ముఖ్యంగా పైరు 35 నుంచి 40 రోజుల దశలో కొరినోస్పొరా ఆకుమచ్చ తెగులు, 45 నుంచి 50 రోజుల దశలో బూడిద తెగులు, 60 నుంచి 65 రోజుల దశలో తుప్పు తెగుళ్లు సోకే అవకాశం ఉంటుంది. మెరుగైన సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ తెగుళ్లను సమర్థవంతంగా అదుపు చేయవచ్చు. తెగులు సోకిన చాలా రోజుల తర్వాత మందును పిచికారీ చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు.
News January 2, 2026
ఒత్తిడిని ఇలా తగ్గించేద్దాం..

అధిక ఒత్తిడినించి బైట పడాలంటే చిన్న చిన్న పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆలోచనలు నెమ్మదిస్తాయి. డీప్ బ్రీతింగ్స్ తీసుకోవాలి. ముక్కు ద్వారా గాలిని పీల్చుకుని నోటి ద్వారా వదలాలి. చాలామంది ఒత్తిడికి గురైనప్పుడు ఆలోచించడం ఆపేయాలని అనుకుంటారు. కానీ దీని వల్ల ఆందోళన పెరుగుతుంది. కాబట్టి కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకుంటేనే శరీరం, మనస్సు రిలాక్స్ అవ్వడం ప్రారంభిస్తాయి.
News January 2, 2026
గిగ్ వర్కర్లకు 90 రోజుల పని నిబంధన

గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రతిపాదించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే అగ్రిగేటర్ వద్ద కనీసం 90 రోజులు, వేర్వేరు అగ్రిగేటర్ల వద్ద పనిచేసేవారు అయితే 120 రోజులు పని చేయాల్సి ఉంటుందని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని ఇప్పటికే కేంద్రం సూచించింది. అర్హులైన వారికి డిజిటల్ ఐడీ కార్డులను జారీ చేయనుంది.


