News August 22, 2024

ఘోరం.. సోదరులకు రాఖీ కట్టి..

image

AP: అచ్యుతాపురం <<13910421>>ఫార్మా<<>> కంపెనీలో జరిగిన ప్రమాదంలో కాకినాడకు చెందిన చల్లపల్లి హారిక (22) మరణించారు. తాపీ మేస్త్రీగా పని చేసే తండ్రి ఐదేళ్ల క్రితం చనిపోయారు. కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె ఏడాది క్రితం ‘ఎసెన్షియా’లో చేరారు. రాఖీ పండుగకు కాకినాడకు రాగా మరో రెండు రోజులు ఉండాలని సోదరులు కోరినా యాజమాన్యం అనుమతించకపోవడంతో నిన్న ఉదయం వెళ్లారు. మృత్యువు వెంటాడటంతో ప్రమాదంలో ప్రాణాలు వదిలారు.

Similar News

News July 10, 2025

తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

image

* రెండున్నర గంటలుగా కొనసాగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీ
* ఆగస్టు లోగా మెగా DSC పూర్తి చేస్తాం: లోకేశ్
* 20న నల్గొండ(D) దేవరకొండ పర్యటనకు CM రేవంత్
* Dy.CM పవన్ ఆదేశాలు.. విజయనగరం(D) దేవాడ మాంగనీస్ గనిలో అధికారుల తనిఖీలు
* కల్తీ కల్లు మృతుల కుటుంబాలకు రూ.20లక్షలివ్వాలి: KTR
* పుట్టపర్తి సత్యసాయి మహాసన్నిధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు

News July 10, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరల్లో కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹220 పెరిగి ₹98,400కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹200 పెరిగి ₹90,200 పలుకుతోంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ రేట్ రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News July 10, 2025

రెండు రోజులు వైన్స్ బంద్

image

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో ఈనెల 13, 14 తేదీల్లో వైన్ షాపులు మూతపడనున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, నార్త్ హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలకు ఈ నిబంధన వర్తిస్తుందని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.