News February 14, 2025

ఘోరం: యువకుడిని చంపి ముక్కలుగా చేసి..

image

AP: రాష్ట్రంలో మరో దారుణ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లా కంభంలో శ్యాంబాబు(30) అనే యువకుడిని దుండగులు ఘోరంగా హత్య చేశారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి వాటిని బస్తాల్లో కుక్కి నక్కలగండి పంట కాలువలో పడేశారు. ఈ హత్య వెనుక సమీప బంధువులే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 23, 2026

దగ్గుబాటి సోదరులపై కోర్టు సీరియస్

image

TG: ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్‌ కూల్చివేత కేసులో దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రానాపై నాంపల్లి కోర్టు ఆగ్రహించింది. ఎన్నిసార్లు కోర్డు ఆర్డర్స్ ధిక్కరిస్తారని ప్రశ్నించింది. సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని వ్యాఖ్యానించింది. ఎన్నిసార్లు తప్పించుకొని తిరుగుతారని మండిపడింది. FEB 5న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరవ్వాలని, లేదంటే నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంది.

News January 23, 2026

IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

image

IBPS ఆర్ఆర్‌బీ క్లర్క్‌ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చు. 8,002 పోస్టుల భర్తీకి డిసెంబర్ 6,7,3,14 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News January 23, 2026

బత్తాయి చెట్లు ఎండిపోతున్నాయా?

image

వేరుకుళ్లు తెగులు సోకినప్పుడు చెట్లు వడలి కాయలు రాలిపోతాయి. దీని నివారణకు 1% బోర్డో మిశ్రమం లేదా 0.2% కార్బండిజమ్(లీటరు నీటికి 2గ్రా. చొప్పున) మిశ్రమం 20 లీటర్లు పాదుల్లో పోయాలి. ఒక్కో చెట్టుకు 10KGల మేర వృద్ధి చేసిన ట్రైకోడెర్మా విరివిడిని చెట్ల పాదుల్లో కలియబెట్టాలి. ట్రైకోడెర్మా రెస్సీ 100గ్రా, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ 100గ్రా, 2KGల వేప పిండి, 25KGల పశువుల ఎరువుతో కలిపి పాదుల్లో వేసుకోవాలి.