News March 24, 2024
ఘోరం.. మొబైల్ పేలిపోయి నలుగురు చిన్నారుల మృతి

యూపీలోని మీరట్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలిపోయింది. మంటలు చెలరేగి మంచానికి అంటుకోవడంతో నలుగురు చిన్నారులు సారిక(12), నిహారిక(8), గోలు(6), కల్లు(5) తీవ్ర గాయాలపాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తండ్రి జానీ(39) పరిస్థితి విషమంగా ఉండగా, తల్లి బబిత(35)కు 60 శాతం గాయాలయ్యాయి. ఆమెను ఢిల్లీ AIIMSకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Similar News
News January 28, 2026
ఆధార్ యాప్ వచ్చేసింది!

ఆధార్ సేవల్లో విప్లవాత్మక మార్పులు చేస్తూ UIDAI కొత్త అప్డేట్ను ప్రకటించింది. ఇకపై ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఆధార్ <<18974342>>యాప్<<>> ద్వారానే మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెచ్చింది. ‘డిజిటల్ ఐడెంటిటీ’ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రయాణాల్లో ఫిజికల్ కాపీలు అవసరం లేకుండానే వెరిఫై చేసేలా మార్పులు చేసింది. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ పనులకు ఇది కీలకం కానుంది.
News January 28, 2026
T20 వరల్డ్ కప్లో ఆడాల్సిందే: పాక్ మాజీలు

బంగ్లాదేశ్కు మద్దతుగా T20 WCను <<18966853>>బహిష్కరించాలని<<>> పాకిస్థాన్ యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీసీబీ చీఫ్ నఖ్వీకి వ్యతిరేకంగా పాక్ మాజీలు గొంతు విప్పుతున్నారు. టోర్నీకి వెళ్లకపోతే పాక్కే నష్టమని హెచ్చరిస్తున్నారు. WCకు జట్టును పంపాలని ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ హఫీజ్, మొహ్సిన్ ఖాన్, రషీద్ సూచించారు. ఐసీసీతో సంబంధాలు చెడగొట్టుకుని ఏం సాధిస్తారని పీసీబీ మాజీ కార్యదర్శి అబ్బాసీ ప్రశ్నించారు.
News January 28, 2026
బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్టీలు సైలెంట్ 1/2

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లపై పార్టీలు సైలెంట్ మోడ్లోకి వెళ్లాయి. రిజర్వేషన్ల బిల్లు పెండింగ్లో ఉండడంతో పార్టీ పరంగా ఆమేరకు సీట్లు ఇస్తామని అవి ఇంతకు ముందు ప్రకటించాయి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ పార్టీ గుర్తులతో జరుగుతున్నా స్పందించడం లేదు. అధికారికంగా 32% సీట్లు BCలకు వస్తున్నందున అదనపు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నాయి. వాటి తీరుపై BCల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


