News March 23, 2024

ఘోరం: కల్తీ మద్యం తాగి 21 మంది దుర్మరణం

image

పంజాబ్‌లో సంగ్రూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురై దాదాపు 40 మంది ఆస్పత్రిపాలవగా, వారిలో ఇప్పటి వరకు 21 మంది మరణించారు. ఈ ఘటనకు కారణమైన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో ఓ ఇంటిపై దాడి చేసి 200 లీటర్ల ఇథనాల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా కేసు విచారణకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

Similar News

News October 2, 2024

12 నిమిషాల్లోనే 2,000 కి.మీ: ఇరాన్ స్పెషల్ మిస్సైల్

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాదాపు 180 బాలిస్టిక్ క్షిపణులు వదిలింది. ఈ దాడులకు ఇరాన్ షాహబ్-2 మిస్సైళ్లను ఎంచుకున్నట్లు సమాచారం. ఇవి దాదాపు 2,000 కి.మీ దూరాన ఉన్న టార్గెట్‌ను హిట్ చేస్తాయి. ఈ మిస్సైళ్లకు వేగం ఎక్కువగా ఉండటంతో వీటిని అడ్డుకోవడం అతి కష్టం. ఇజ్రాయెల్‌కు చేరుకున్న కొన్ని క్షిపణులను అమెరికా కూడా అడ్డుకోలేకపోయింది. ఇదే కాక 17,000 కి.మీ దూరం ప్రయాణించే సెజిల్ మిస్సైల్ ఇరాన్ అమ్ములపొదిలో ఉంది.

News October 2, 2024

వివాదంపై స్పందించిన త్రిప్తి దిమ్రీ

image

డబ్బు తీసుకొని ఈవెంట్‌కు గైర్హాజరయ్యారంటూ తనపై వస్తున్న <<14249459>>ఆరోపణలపై<<>> బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రీ స్పందించారు. జైపూర్‌లో తాను ఏ ఈవెంట్‌ మిస్ కాలేదని, అసలు తాను డబ్బే తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆమెపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ త్రిప్తి టీమ్ ఈమేరకు ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆమె ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ మూవీ ప్రమోషన్స్‌ కోసం అన్ని ఈవెంట్లకు హాజరవుతున్నట్లు పేర్కొంది.

News October 2, 2024

మంత్రి కొండా సురేఖకు ప్రకాశ్ రాజ్ కౌంటర్

image

TG: మంత్రి కొండా సురేఖకు నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు? సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే అంత చిన్న చూపా? జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సురేఖ మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. కాగా నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే చాలామంది హీరోయిన్లకు ఆయన డ్రగ్స్ అలవాటు చేశారని ఆమె వ్యాఖ్యానించారు.