News September 1, 2024
ఘోరం: ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

TG: సంగారెడ్డి జిల్లా రుద్రారంలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. గోరు ముద్దలు తినిపించాల్సిన చేతితోనే ఆ మాతృమూర్తి పిల్లలకు తొలుత విషమిచ్చింది. ఆ తర్వాత తాను ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక కష్టాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
Similar News
News December 8, 2025
ఆ రెండు రోజులు స్కూళ్లకు సెలవులు!

TGలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ నెల 11,14,17 తేదీల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. తొలి విడతలో 4,236, రెండో విడతలో 4,333, మూడో విడతలో 4,159 గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం గ్రామాల్లోని స్కూళ్లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 14న ఆదివారం కాగా 11,17న పోలింగ్ జరిగే స్కూళ్లకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే ప్రకటన రావచ్చు.
News December 8, 2025
YCP కక్షపూరిత రాజకీయాలతో ఖజానాకు నష్టం: CM

AP: YCP కక్షపూరిత రాజకీయాలతో గతంలో ప్రజాధనం నష్టమైందని CM CBN విమర్శించారు. ‘PPAల రద్దుతో విద్యుత్ వాడకుండానే ₹9వేల కోట్లు కట్టాల్సి వచ్చింది. మూలధన వ్యయం లేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఆస్తుల్నే కాకుండా భవిష్యత్తు ఆదాయాన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఎంత కష్టమైనా సరే హామీలను నెరవేరుస్తున్నాం. ఆగిన పథకాలను పునరుద్ధరించాం’ అని CM వివరించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు.
News December 8, 2025
ఈ సింప్టమ్స్ ఉంటే మహిళలకు గుండెపోటు ముప్పు

* డెంటల్ ప్రాబ్లమ్స్ లేదా టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ సమస్య అనిపించేలా దవడ నొప్పి
* పుల్లటి త్రేన్పులు, తరచూ వికారంగా ఉండడం, వాంతులు.
* అజీర్ణ సమస్యలు. ఫుడ్ పాయిజన్ కారణమనే భావన.
* హార్ట్బీట్లో హెచ్చుతగ్గులు.
* వెన్నెముక పైన, భుజం బ్లేడ్ల మధ్యలో, బ్రెస్ట్ కింది భాగంలో నొప్పి.
* శారీరక శ్రమ లేకున్నా చెమటలు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.
* ఈ సింప్టమ్స్ ఉంటే మహిళలకు గుండెపోటు ముప్పు


