News September 1, 2024
ఘోరం: ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

TG: సంగారెడ్డి జిల్లా రుద్రారంలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. గోరు ముద్దలు తినిపించాల్సిన చేతితోనే ఆ మాతృమూర్తి పిల్లలకు తొలుత విషమిచ్చింది. ఆ తర్వాత తాను ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక కష్టాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
Similar News
News November 17, 2025
సంబంధం లేని సబ్జెక్టులు.. టీచర్లకు టెట్ తిప్పలు

TG: టెట్ సిలబస్లో తమకు సంబంధం లేని సబ్జెక్టులు ఉండటంతో <<18279466>>టీచర్లు <<>>ఆందోళన చెందుతున్నారు. 15 ఏళ్ల కిందట వదిలేసిన సబ్జెక్టుల్లోంచి ప్రశ్నలొస్తే పరీక్ష ఎలా రాయాలని ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లిష్, బయాలజీ, ఫిజిక్స్ టీచర్లకు సంబంధంలేని సబ్జెక్టుల నుంచే 90 మార్కులు ఉన్నాయంటున్నారు. తమ సబ్జెక్టుల నుంచి 12 మార్కులే ఉంటే ఎలా పాస్ అవుతామని కొందరు అడుగుతున్నారు. సబ్జెక్టుల వారీగా టెట్ పెట్టాలని కోరుతున్నారు.
News November 17, 2025
ఆవు పొదుగులోనే అరవై ఆరు పిండివంటలూ..

ఆవు పాలు, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల నుంచి అనేక రకాలైన వంటకాలు, పిండి వంటలను తయారు చేయవచ్చు. ఈ సామెత ఆవు పాలు, వాటి ఉత్పత్తుల యొక్క గొప్పతనాన్ని, అవి అందించే విస్తృతమైన ప్రయోజనాలను, వంటకాల వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. ఆవు పాలు ఎన్నో రకాలైన రుచికరమైన, సాంప్రదాయకమైన ఆహార పదార్థాలకు మూలాధారమని దీని అర్థం.
News November 17, 2025
శివుడే వైరాగి.. మరి మనకు సంపదను ప్రసాదించగలడా?

శివుడే వైరాగి. పైగా కైలాసంలో ఉంటాడు. పులి చర్మాన్ని ధరిస్తాడు. మరి ఆయన సంపదలను ఇవ్వగలడా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కానీ ఆ సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఆయనే మోక్షం, సంతోషం అనే శాశ్వత సంపదలకు అధిపతి. ఇక అష్టైశ్వర్యాలకు అధిపతి అయిన కుబేరుడు, శివుని ఆశీస్సులతోనే ఆ స్థానాన్ని పొందాడు. ప్రశాంతత అనే సంపదకు మూలమైన చంద్రుణ్ని తలపై ధరించి అలా కూడా మనల్ని అనుగ్రహిస్తున్నాడు.


